మోడీ ఫోటో తొలగింపు దుమారం.. తమిళనాడు పంచాయతీలో పంచాయితీ..
ఇటీవల ప్రముఖుల ఫోటోలు తొలగించడం పరిపాటిగా మారింది. రాజకీయ వైరంతో ఇలా కొందరు చేస్తున్నారు. మరికొందరు అయితే ఫోటోలు వద్దని అంటున్నారు. తమిళనాడు ఇందులో ప్రత్యేకం.. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా.. జాతీయ పార్టీలకు అంత ఛాన్స్ ఉండదు. అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో సన్నిహితంగా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది.
కోయంబత్తూరు జిల్లా వెల్లలూర్ పంచాయతీలో ఘటన జరిగింది. కనగరాజ్ అనే సభ్యుడు మోడీ ఫోటో తొలగించారు. ఈయన ఇండిపెండెంట్గా వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు అధికార డీఎంకే మద్దతు తెలిపింది. కనగరాజ్ ఫొటో తొలగించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీనికి సంబంధించి పోతనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. మోడీ ఫోటో తీసివేసినందుకు కనగరాజ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రధాని మోడీ ఫోటో తొలగించడం ఇదీ మొదటిది కాదు. ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇంటి యాజమానిని బెదిరించాడు. మోడీ ఫోటో తీసివేయాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.