దేశంలో కరోనా కల్లోలం: ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరచూ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కట్టడికి ఆంక్షలు అమలు చేయాలని సూచిస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతోపాటు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను కూడా పంపి పరిస్థితిని సమీక్షిస్తోంది.
Recommended Video
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్డౌన్ కొనసాగుతోంది.

కాగా, భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 కోవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం నాడు నమోదైన 1.68 లక్షల కేసుల కంటే 15.8 శాతం ఎక్కువ. రోజువారీ పాజిటివిటీ రేటు ప్రతి 100 పరీక్షలకు సోకిన వ్యక్తుల సంఖ్య - 11.5 శాతంగా ఉందని ప్రభుత్వ డేటా చూపిస్తుంది భారతదేశం ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను నమోదు చేసినట్లు సమాచారం. ఓ పక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా 5 వేలకు చేరువ కావడం ప్రధానంగా కనిపిస్తుంది .
మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ వేరియంట్ 1,281 కేసులు, రాజస్థాన్లో 645 కేసులు ఉన్నాయి. మంగళవారం నాడు 407 మంది లో కొత్తగా ఈ వేరియంట్ ని గుర్తించారు. ఓమిక్రాన్ కేసుల విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.ఇదిలా ఉంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కనీసం 120 జిల్లాలు మహమ్మారి థర్డ్ వేవ్లో వారానికి 10 శాతం పాజిటివ్ రేటును నివేదించాయి.
మంగళవారం నాడు 17 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపగా అందులో1,94,720 మంది మా మరి బారిన పడ్డారు. గత 24 గంటల్లో 442 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం క్రియాశీల కేసులు తొమ్మిది లక్షల మార్కును దాటాయి. క్రియాశీల కేసుల రేటు 2.65 శాతానికి పెరిగిపోయింది. ఇక రోజువారీ కేసులు కంటే రికవరీలు తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నవారు 60,405 మంది. రికవరీ రేటు 96.01 శాతానికి తగ్గింది. మొత్తం గత 24 గంటల్లో 442 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 4.84 లక్షలకు చేరుకుంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications