వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: మరోసారి సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష -డెల్టా ప్లస్ విజృంభణపై కేంద్రం హైరానా

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖంపట్టినప్పటికీ ప్రమాదం తప్పిపోయినట్లు కాదని కేంద్రం పదే పదే హెచ్చరిస్తున్నా, చాలా రాష్ట్రాలు మళ్లీ పాత బాటలోకి పయనిస్తున్నాయి. ఉత్తరాదిలోని పలు పర్యాటక కేంద్రాలకు జనం పోటెత్తడం, ఆథ్యాత్మిక క్షేత్రాల వద్దా హడావుడి పెరిగిన నేపథ్యంలో కేంద్రం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. అటు ఈశాన్య భారతంలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి, కొత్త కేసుల పెరుగుదలపైనా కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే..

జగన్ సర్కారు ఖర్చులు: బ్లాక్, వైట్ బిల్లులా? -ఆ ప్రధానికి చంద్రబాబు భయపడలేదా?: సాయిరెడ్డి ధ్వజంజగన్ సర్కారు ఖర్చులు: బ్లాక్, వైట్ బిల్లులా? -ఆ ప్రధానికి చంద్రబాబు భయపడలేదా?: సాయిరెడ్డి ధ్వజం

ఈశాన్య రాష్ట్రాల్లో తాజాగా కొవిడ్ కేసులు పెరుగుతుండటం, ప్రమాదకరమైన డెట్లా ప్లస్ వేరింట్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడి పరిస్థితిపై ఫోకస్ పెంచారు. ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ రివ్యూపై ఇప్పటికే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పీఎంవో సమాచారం చేరవేసింది.

PM Modi to review Covid-19 situation with CMs of all Northeast states on tuesday

ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌, త్రిపురలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్యంలోని దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా నమోదవుతున్నది. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్నది. పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారకముందే ఆయా రాష్ట్రాలు చేపట్టాల్సిన జాగ్రత్తను మోదీ నిర్దేశించనున్నారు.

రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరి చిప్ప -కాంగ్రెస్‌కు మరో షాక్ -కొట్లాడేది టీఆర్ఎస్సే: కేటీఆర్ -రమణ తర్వాత..రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరి చిప్ప -కాంగ్రెస్‌కు మరో షాక్ -కొట్లాడేది టీఆర్ఎస్సే: కేటీఆర్ -రమణ తర్వాత..

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,154 కేసులు, 724 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాలు 4,08,764కు, రికవరీలు 3.01కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 4,50,899 యాక్టివ్ కేసులున్నాయి.

English summary
Prime Minister Narendra Modi will review the situation pertaining to Covid-19 with the chief ministers of all Northeastern states at 11 am on Tuesday. The prime minister will interact with chief ministers of Assam, Nagaland, Tripura, Sikkim, Manipur, Meghalaya, Arunachal Pradesh and Mizoram via video conferencing. The situation in Manipur, Assam and multiple districts in other Northeastern states is still grim, as far as positivity rates are concerned. Last week, Union Home Secretary Ajay Bhalla also reviewed the Covid-19 situation in the Northeast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X