ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనల్లో మోదీ- ఆ చర్చికి ఓ ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి
న్యూఢిల్లీ: ఇవ్వాళ ఈస్టర్ సండే.. జీసస్ పునరుత్థానమైన రోజు. గుడ్ ఫ్రైడే తరువాత వచ్చే తొలి ఆదివారాన్ని ఈస్టర్ సండేగా జరుపుకొంటారు క్రైస్తవులు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రల్లో చర్చిలన్నీ భక్తులతో నిండిపోయాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇవ్వాళ ఈస్టర్ సండే ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ సాయంత్రం ఆయన దేశ రాజధానిలోని శాక్ర్డ్ హార్ట్ క్యాథడ్రెల్ క్యాథలిక్ చర్చ్కు వెళ్లారు. కొవ్వొత్తిని వెలిగించారు. జీసస్ విగ్రహం ముందు కొద్దిసేపు ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఓ ప్రధానమంత్రి- ఈ చర్చికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చర్చికి వచ్చిన ప్రధాని మోదీని బిషప్ అనిల్ ఖుటో, ఫాదర్ ఫ్రాన్సిస్ స్వామినాథన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు శాలువ కప్పి ఆహ్వానించారు. నేరుగా చర్చ్ లోనికి వెళ్లారు. బిషప్ అనిల్ ఖుటో సమక్షంలో కొవ్వొత్తిని వెలిగించి, ప్రార్థనలు చేశారు. అనంతరం బిషప్ అనిల్ ఖుటో, ఫాదర్ ఫ్రాన్సిస్ స్వామినాథన్తో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సుమారు 40 నిమిషాల పాటు అక్కడే గడిపారు మోదీ.
ఈస్టర్ సండేను పురస్కరించుకుని ఈ ఉదయం మోదీ క్రైస్తవులకు శుభాకాంక్షలను తెలిపారు. ఈస్టర్ సండే జరుపుకోవడం ఓ ప్రత్యేక సందర్భమని వ్యాఖ్యానించారు. సమస్త మానవాళికి, సమాజానికి సామరస్య స్ఫూర్తిని పంచిన రోజుగా అభివర్ణించారు. అణచివేతకు గురవుతున్న వారిని ఆదుకోవాలని, వారికి చేయూత అందించాల్సిన బాధ్యతను ఈస్టర్ సండే గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.
క్రీస్తు పవిత్రమైన ఆలోచనలను స్మరించుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కాగా ఈస్టర్ సండేను పురస్కరించుకుని శాక్ర్డ్ హార్ట్ కేథడ్రల్ క్యాథలిక్ చర్చిని అందంగా అలంకరించారు. వందలాది మంది భక్తులు చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. మోదీ రాక సందర్భంగా ప్రొటోకాల్ను పాటించారు. ఎంపిక చేసిన భక్తులకు మాత్రమే చర్చిలో ప్రార్థనలకు అనుమతి ఇచ్చారు.
-
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications