శతృదుర్భేద్యం- మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం..
PM Narendra Modi: దేశ నౌకాదళం ఇక మరింత శక్తిమంతమైంది. సముద్ర జలాల్లో గస్తీని పెంచడం, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా రూపుదిద్దుకుంటోంది. చైనా దక్షిణ సముద్ర తీర ప్రాంతం నుంచి ముప్పు పొంచివున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత శక్తిమంతమైన మూడు యుద్ధనౌకలు బరిలోకి దిగాయి.
ఈ మూడింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి ఈ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారాయన. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తొలుత- నౌకాదళాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్- ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ సామర్థ్యం రెట్టింపు అవుతోందని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో దలాది కొత్త నౌకలు, కొత్త కంటైనర్లు అవసరమౌతాయని మోదీ పేర్కొన్నారు. వాటిని తయారు చేసుకునే క్రమంలో దేశవ్యాప్తంగా గల అన్ని పోర్టులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వబోతోన్నాయని అన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని అన్నారు.
జనావాసాలకు దూరంగా ఉంటూ వస్తోన్న దీవులను కూడా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతను ఇస్తోన్నామని మోదీ చెప్పారు. సముద్రాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి సముద్రయాన్ ప్రాజెక్ట్ను చేపట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనివల్ల సముద్ర గర్భంలో 6,000 అడుగుల లోతున చోటు చేసుకునే పరిణామాలపై అధ్యయనం చేయవచ్చని చెప్పారు.
అతి కొద్ది దేశాలు మాత్రమే ఈ దుర్భేధ్య మిషన్ను చేపట్టాయని, వాటి సరసన భారత్ కూడా చేరుతుందని మోదీ అన్నారు. అనంతరం ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షేర్ యుద్దనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి జాతికి అంకితం చేశారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications