నిద్రపోయే అధికారులపై వేటు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పని చెయ్యకుండా కాలం వెల్లదీస్తున్న ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు లోక్ సభలో మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకూ విధులు దుర్వినియోగం చేస్తున్న 13 మంది అధికారులను డిస్మిస్ చేశామని, 43 మంది అధికారుల ఫించన్ కట్ చేశామని వివరించారు.

విధుల నిర్వహణ, ప్రజాసేవలో ఆ అధికారుల పనితీరు అసంతృప్తిగా ఉండటం వలనే వారి మీద కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు. అసమర్థులైన అధికారుల మీద ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరపాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. 30 ఏళ్ల సర్వీసు పూర్తవడానికి ముందు ప్రతి ఉద్యోగికి కనీసం ఆరు సార్లు ఈ సమీక్ష జరగాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని, పని చెయ్యని ఉద్యోగులకు రిటైర్ మెంట్ ఇప్పిస్తామని మంత్రి వివరించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications