'సంచలన ప్రతిపాదన: మోడీని తప్పించి పగ్గాలు అద్వానీకి!'
ప్రధాని స్థానం నుంచి మోడీని తప్పించి దేశాన్ని కాపాడాల్సిందిగా ఆమె బీజేపీని కోరారు.
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపి ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ లేదా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూర్చోబెట్టవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రతిపాదన చేశారు.
మోడీ పనితీరును వ్యతిరేకిస్తూ మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని స్థానం నుంచి మోడీని తప్పించి దేశాన్ని కాపాడాల్సిందిగా ఆమె బీజేపీని కోరారు. ఇందుకోసం బీజేపీకి ఓ ప్రతిపాదన చేసిన మమతా.. మోడీ స్థానంలో అద్వానీ, రాజ్నాథ్ సింగ్ లేదా అరుణ్ జైట్లీకి పగ్గాలు అప్పగించాలని సూచించారు.

ప్రస్తుతం దేశమంతటా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనంతటికీ మోడీయే కారణమని మమతా ఆరోపించారు. దేశంలో పరిస్థితులు చక్కబడాలంటే.. మోడీ స్థానంలో మరో బీజేపీ నాయకుడు ప్రధాని పదవిని చేపట్టాల్సిన అవసరముందని మమతా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, పెద్ద నోట్ల రద్దును మమతా బెనర్జీ తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపీలను సబీఐ అరెస్టు చేయడంతో.. ఇదంతా మోడీ కక్ష సాధింపు చర్య అని మమతా ఆరోపిస్తూ వస్తున్నారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications