ప్రజాస్వామ్యంపై ప్రధాని మోడీకి నమ్మకం లేదు.. కాంగ్రెస్ నేత ధ్వజం
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల సమరంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. మాటల దాడికి దిగుతూ ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు ప్రధానంగా మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మోడీపై ఆరోపణలు గుప్పించారు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదంటూ విరుచుకుపడ్డారు.
మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఇటీవల విపక్షాలను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఓటమి పాలయ్యాక ప్రజల తీర్పు గౌరవించని విపక్షాలు.. ఈవీఎంలపైకి నెట్టి తప్పించుకుంటాయని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గరమవుతున్న హస్తం గూటి నేతలు మోడీకి దీటుగా సమాధానం చెబుతున్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారే.. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కామెంట్స్ చేస్తారని ఎద్దేవా చేశారు రణ్దీప్ సుర్జేవాలా.