అద్భుత దృశ్యాలు: మహాకాల్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీలో శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్నారు ప్రధాని మోడీ.
ఈ సందర్భంగా మహాకాళుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాకాల్ లోక్ కారిడార్ తొలిదశను ప్రారంభించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన మహాకాళేశ్వర్ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆలయంలో అభివృద్ధి చేసిన 900 మీటర్ల పొడవైన కారిడార్.. 'మహాకాల్ లోక్'ను.. భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేవిధంగా తీర్చిదిద్దారు.
కాగా, 2017లో ఈ ప్రాజెక్టు మొదలైంది. గుజరాత్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు నిర్మాణాలను తీర్చిదిద్దారు. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్పత్ర, సప్తపర్ణి వంటి 40-45 రకాల మొక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
శిప్రా
నదీతీరాన
వెలసిన
ఉజ్జయినికి
అవంతిక
అనే
పురాతన
పేరుంది.
దిగ్గజ
పాలకుడు
విక్రమాదిత్యుడు
ఈ
ప్రాంతాన్ని
పాలించాడు.
రెండు
ద్వారాలు
మహాకాల్
లోక్
భక్తులకు
స్వాగతం
పలుతున్నట్టుగా
రెండు
ప్రవేశ
ద్వారాలను
ఏర్పాటు
చేశారు.
అందులో
ఒకటి
నందీ
ద్వార్..
ఎత్తయిన
రెండు
నందులు..
భక్తులకు
స్వాగతం
పలుకుతున్నట్లుగా
ఈ
ప్రవేశ
ద్వారాన్ని
ఏర్పాటు
చేశారు.
ఈ
ప్రవేశ
ద్వారానికి
ముందు
ఏర్పాటు
చేసిన
వినాయక
విగ్రహం
ప్రత్యేక
ఆకర్షణగా
నిలుస్తోంది.
#WATCH | Ujjain, MP: PM dedicates to the nation Shri Mahakal Lok. Phase I of the project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities
— ANI (@ANI) October 11, 2022
Total cost of the entire project is around Rs 850 cr.
(Source: DD) pic.twitter.com/J1UnlU9XLa
మరో ద్వారం పేరు పినాకి ద్వార్.. ఈ ద్వారంపైన ధనుస్సును అమర్చారు. త్రిపురాసురులు అనే రాక్షుసులను శివుడు హతమార్చినందుకు గుర్తుగా ఈ ద్వారానికి ఆ పేరు పెట్టారు. బ్రహ్మ రథసారధిగా ఉండగా.. పరమేశ్వరుడు ధనుస్సు చేతబట్టి.. త్రిపురాసురులను ఒకే బాణంతో అంతం చేస్తాడు. ఆ ఘట్టాన్ని వివరించేలా చెక్కిన శిల్పం.. అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. లోపల కూడా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక లోకానికి వెళ్లినట్లు అనుభూతిని కలిగేలా నిర్మాణాలు భక్తులను ఎంతోగానే ఆకట్టుకుంటున్నాయి.