కేజ్రీతో చేయి కలిపిన మోడీ: ఆరా తీశారు, ఆల్ రైట్ అని సీఎం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆరా తీశారు. రాష్ట్రపతి భవన్లో ఇరువురు నేతలు కలుసుకున్నారు. భారతరత్న అవార్డుల అనంతరం వీరు కలిశారు. చేయి చేయి కలిపారు. నవ్వుతూ పలకరించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయన ఆరోగ్యంపై అడిగారు. దానికి కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను బాగానే ఉన్నానని చెప్పారు. కాగా, గతంలో కేజ్రీవాల్ అనారోగ్యానికి గురైనప్పుడు.. బెంగళూరు బేస్డ్ డాక్టర్ నాగేంద్రను కలవాలని ప్రధాని మోడీ సూచించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లి పదిరోజుల పాటు చికిత్స చేయించుకున్నారు.
పార్టీ విభేదాలపై...
అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు పార్టీ విభేదాల పైన స్పందించారు. బాధపడాల్సిన విషయం లేదని, పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. తామంతా చక్కగా మేనేజ్ చేసుకుంటాన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతా బాగుందన్నారు. కాగా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ల అంశం పార్టీలో కలకలం రేపిన విషయం తెలిసిందే.