Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయలలిత స్పృహలోని స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు: షుగర్ లెవెల్స్ 508, కుట్ర జరిగిందా !

జయలలిత ఆరోగ్యం విషయంలో పోయెస్ గార్డెన్ సిబ్బంది నిర్లక్షం చేశారని వెలుగు చూసింది.

చెన్నై: జయలలిత ఆరోగ్యం విషయంలో పోయెస్ గార్డెన్ సిబ్బంది నిర్లక్షం చేశారని వెలుగు చూసింది. 2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి జయలలిత స్పృహలోని స్థితిలో అపోలో ఆసుపత్రిలో చేరారని గురువారం తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

జయలలిత ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆమెకు షుగర్ లెవెల్స్ 508 (ఎంజీ) ఉందని మీడియాలో ప్రసారం అయ్యింది. జయలలిత ఐస్ క్రీం ఎక్కువగా తిన్నందువలనే షుగర్ లెవెల్స్ పెరిగాయని వైద్యులు అంటున్నారు. జయలలిత ఆరోగ్యం కోసం పోయెస్ గార్డెల్ లో ఉన్న వైద్యులు, నర్సులు ఆ సమయంలో ఏం చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

poes garden people did not take care of Jayalalithaa

జయలలిత షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఆమె స్పృహ కోల్పోయేవరకు వైద్యులు ఏం చేస్తున్నారు ? అనే విషయం ఇప్పుడు అంతు చిక్కడం లేదు. పోయెస్ గార్డెన్ సిబ్బంది నిర్లక్షంతోనే జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురైనారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అమ్మ అభిమానులు అంటున్నారు.

అపోలో ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు పోయెస్ గార్డెన్ కు వెళ్లారని గురువారం వెలుగు చూసింది. అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులు స్నేహ, అనిష్, సురేష్ అనే ముగ్గురు పోయెస్ గార్డెన్ వెళ్లి జయలలిత ఆరోగ్య పరిస్థితి పరిశీలించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సమాచారం.

poes garden people did not take care of Jayalalithaa

మొత్తం మీద జయలలిత మరణం మిస్టరీగా మారింది. విచారణ కమిషన్ లో మొత్తం విషయాలు వెలుగు చూస్తే అమ్మ మరణానికి అసలు కారణం ఏమిటి ? ఏమైనా కుట్ర జరిగిందా ? అనే విషయాలు వెలుగు చూస్తాయని అమ్మ అభిమానులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+