శబరిమలలో హై అలర్ట్, ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర, ఆహారం, నీటిలో విషం, దాడులు !
కేరళ శబరిమల ఆలయానికి భారీ బందోబస్తుఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల భారీ స్కెచ్, హై అలర్ట్ అయ్యప్ప భక్తులపై దాడులకు కుట్ర, ఆహారం, నీటిలో విషం కలపాలని
తిరువనంతపురం: ప్రపంచ ప్రసిద్ది చెందిన శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శబరిమలలో హై అలర్ట్ ప్రకటించారు. పలు జీహాది ఉగ్రవాద సంస్థలు శబరిమల ఆలయం దగ్గర అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడి చేసే అవకాశం ఉందని బెదిరింపులు రావడంతో కేరళ పోలీసులు అలర్ట్ అయ్యారు.
కేరళలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా శబరిమలలో హై అలర్ట్ ప్రకటించి గట్టి నిఘా వేశారు. కేరళకు చెందిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు రశీద్ అబ్దుల్లా మళయాలంలో మాట్లాడిన ఆడియో టేపు నిఘా అధికారుల చేతికి చిక్కింది.
10 నిమిషాలు పాటు మళయాలంలో మాట్లాడిన రశీద్ అబ్దుల్లా కేరళలోని త్రిశూర్ కుంభమేళలలో ఆహారం, తాగునీటిలో విషం కలపాలని సూచించాడు. అంతే కాకుండా కుంభమేళలో వేల సంఖ్యలో భక్తులు వస్తారని, ఆ సందర్బంలో దాడులు చెయ్యాలని పిలుపునిచ్చాడు. కేరళలో ప్రసిద్ది చెందిన ఆలయాలను టార్గెట్ చెయ్యాలని రశీద్ అబ్దుల్లా మళయాలంలో చెప్పాడు. ఇదే సమయంలో శబరిమల ఆలయానికి బెదిరింపులు రావడంతో పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు.