మహిళపై గ్యాంగ్ రేప్: ప్రైవేట్ పార్ట్లోకి కర్ర, ఒకరి అరెస్టు
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్లో 30 ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నర్సరీ గార్డెనర్ను అరెస్టు చేశారు. మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశారనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించుకున్నారు.
గార్డెనర్ సుల్తాన్పురిలోని మృతురాలి ఇంటి సమీపంలోనే ఉంటాడని పోలీసులు గుర్తించారు. ఆమెతో స్నేహం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర వ్యక్తులతో ఆమె సన్నిహితంగా మెలగడం అతనికి నచ్చలేదు. దాంతో అతను తన అనుచరులతో కలిసి ఆమెను పట్టుకుని సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత శవాన్ని నర్సరీలో పడేశారు.
గార్డెనర్ను పోలీసులు అరెస్టు చేసి, అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆదివారంనాడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు శుక్రవారంనుంచి కనిపించడం లేదు. ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్లో కర్ర దూర్చారు. ఆమె శవం దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో గల ఢిల్లీ అభివృద్ధి అథారిటీ నర్సరీలో కనిపించింది.
ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ముప్పై ఏళ్ల వయస్సు గల మహిళ పైన పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన విషయం శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఆమె మృతదేహానికి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావించి దర్యాప్తు చేపట్టారు. ఆమె కాళ్లు, చేతులు కట్టి వేయడంచతో పాటు మెడ చుట్టూ వస్త్రంతో చుట్టి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
దక్షిణ ఢిల్లీలోని సుల్తాన్ పూర్కు చెందిన ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఓ వర్క్ షాపులో టైలర్గా పని చేస్తోంది. ఆమె భర్త గతంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో బాధిత మహిళనే ఆ ఇంటిని పోషిస్తోంది. శుక్రవారం విధుల్లోకి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.