ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలు అయ్యేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. పొంగులేటి తరఫున ఆయన న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఇందులో ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థిక, హోంశాఖ, మానవ వనరుల అభివృద్ధి, జలవనరుల శాఖలను చేర్చారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని తెలిపి తదిపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications