పబ్లో కూతుళ్ల ఘర్షణ: పూజా బేడీ, మీనాక్షి పోటాపోటీ ఫిర్యాదులు
ముంబై: నటి పూజా బేడీ, రామానంద సాగర్ మనవరాలు మీనాక్షి సాగర్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. వారిద్దరు కూతుళ్లు ఓ పబ్లో గొడవ పడ్డారు. దీంతో వారిద్దరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. తాను మీనాక్షి సాగర్పై, ఆమె కూతురు సాక్షిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజా బేడీ మీడియా ప్రతినిధులకు చెప్పారు.
లవారు కూతురు ఆలియాను, తనను, మరణించిన తన తల్లి ప్రతిమా బేడీని, తన మాజీ భర్త ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నీచర్వాలాను ఎస్ఎంఎస్ల ద్వారా వేధించారని, బెదిరించారని, దూషించారని, అమర్యాదకరంగా తిట్టారని, టెలిఫోన్ సంభాషణలను రికార్డు చేశామని, సోషల్ మీడియా వ్యాఖ్యలను కూడా రికార్డు చేశామని, దాంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు.

పూజా బేడీ మంగళవారంనాడు ఫిర్యాదు చేయగా, మీనాక్షి కూడా ఫిర్యాదు చేసింది. నవంబర్ 28వ తేదీన పూజా 17 ఏల్ల కూతురు ఆలియా, సాక్షి గొడవ పడ్డారు. ఆలియా పబ్లో తన జన్మదిన వేడుకలను చేసుకుంటుండగా, అదే పబ్లో సాక్షి తన తల్లి, తన ఫ్రెండ్తో పబ్లో ఉంది. ఆ తర్వాత పూజా, మీనాక్షి కూడా గొడవ పడ్డారు.
సంఘటనపై ఓ వార్తా సంస్థ ప్రతినిధి సంప్రదించగా, విషయం కోర్టులో ఉన్నందున తాను మాట్లాడే అవకాశం లేదని మీనాక్షి సాగర్ చెప్పారు.












Click it and Unblock the Notifications