Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బృందావనంలో విషాదం: భవన బాల్కనీ కూలి పడటంతో ఐదుగురు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాంకే బిహారీ ఆలయం సమీపంలో ఓ పురాతన భవనం బాల్కనీ కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

కాగా, బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం వీధులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక్కడ దుకాణాలు ఎక్కువగా ఉండటంతో భక్తులు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటారు. మంగళవారం ఈ ప్రాంతంలోని ఓ భవనం బాల్కనీ ఒక్కసారిగా విరిగిపడింది. ఆ శిథిలాలు ఓ కారుపై, అక్కడ నిల్చుకున్న మరికొందరు వ్యక్తులపై పడిపోయాయి. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.

Portion Of Building Near Vrindavans Banke Bihari Temple Collapsed: 5 killed, 10 injred

బాల్కనీ కూలిపోయిన వెంటనే భారీ శబ్ధం వెలువడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల ప్రజలు బిగ్గరగా అరుస్తూ పరుగులు తీశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని మథుర అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, బృందావన్ ఎస్‌హెచ్‌ఓ విజయ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కనీలో ఓ జంట కోతులు గొడవ పడుతుండగా అది పడిపోయింది.

సంఘటన గురించి మధుర ఎస్‌ఎస్‌పి శైలేష్ కుమార్ పాండే మాట్లాడుతూ.. "సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో పోలీసులు యాదృచ్ఛికంగా ఉన్నారు. శిథిలాల కింద ఉన్న వారందరినీ వెంటనే రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. 11 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు మరణించినట్లు ధృవీకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+