టోకరా: యుపతిపై పలుమార్లు రేప్, హైదరాబాద్ వెళ్తున్నానని...
భోపాల్: ఓ 27 ఏళ్ల యువకుడు సిబిఐలో డిఎస్పీగా పనిచేస్తున్నానంటూ బాలికను, ఆమె కుటుంబాన్ని మోసం చేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ షాకింగ్ మాట్రిమోనియల కేసును పోలీసులు ఛేదించారు.
డిఐజి ర్యాంక్ చిహ్నం న్న యూనిఫారాన్ని, మూడు ప్రభుత్వ సీల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి 24 యువతిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అతను థానేకు చెందినవాడు
నిందితుడు సమీర్ అన్వర్ ఖాన్ వారణాసికి చెందినవాడని, ప్రస్తుతం థానేలో నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు. అతను ఎంటెక్ విద్యార్థి, ఆన్లైన్ మాట్రిమోనియల్ వెబ్సైట్లో మూడు నెలల క్రితం తన తండ్రి తన ప్రొఫెల్ క్రియేట్ చేశాడని మహిళ తన ఫిర్యాదులో తెలిపారు.
ఇలా అతను టచ్లోకి...
వెబ్సైట్లో తమకు సమీర్ ప్రొపైల్ తగిలిందని, తాను డిఎస్పీనని, అండర్ కవర్ సిబిఐ ఏజెంట్నని చెప్పుకున్నాడని చెప్పిది. అతని అంకుల్ సంప్రదింపులతో తన తండ్రి కుటుంబాన్ని సమీర్కు పరిచయం చేశాడని, తమ కుటుంబం కోరిక మేరకు దాదాపుగా పెళ్లి కూడా నిశ్చయమైందని వివరించింది.
మహిళపై హోటల్లో అత్యాచారం
సమీర్ అక్టోబర్ 22వ తేదీన భోపాల్ వచ్చాడని, విలాసవంతమైన లాల్ఘతి హోటల్లో దిగాడని, తనను హోటల్ గదికి పిలిచి తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. నవంబర్లో తిరిగి వచ్చి, అదే హోటల్లో ఖాజీ సమక్షంలో వివాహం చేసుకున్నట్లు చెప్పాడని ఆమె చెప్పింది.
హైదరాబాద్కు వెళ్లాలని 2 లక్షలు
తాను యుపిఎస్సి పరీక్షల్లో విజయం సాధించానని, ఐపిఎస్గా ఎంపికయ్యాయనని అతను ఆమెకు చెప్పాడు. ఆమెను లోబరుచుకుని రెండు లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు. ఐపిఎస్ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి ఆ డబ్బులు తీసుకున్నాడు.
ఎన్ని సార్లు కోరినా...
ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి వచ్చాడు. ఈసారి సర్వైవర్స్ ఇంటిలో ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత సర్వైవర్ అతన్ని అనుమానించడం ప్రారంభించాడు. మహిళ కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు కోరినా సమీర్ తన కుటుంబాన్ని భోపాల్కు పిలిపించలేదు.
తన తండ్రి గురించి అబద్ధం
తన తండ్రి ముంబైలో పేరుమోసిన వస్త్రవ్యాపారి అని సమీర్ అబద్ధం చెప్పాడు. అతని అంకుల్ ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో సీనియర్ పోలీసు అధికారి అని కూడా అబద్ధమాడాడు.