సర్! ఆరెస్సెస్ సమావేశాలకు వెళ్లండి కానీ: ప్రణబ్ ముఖర్జీకి చిదంబరం సూచన
న్యూఢిల్లీ: నాగపూర్లో వచ్చే నెల 7వ తేదీన జరగనున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శిక్షా వర్గ్కు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లవద్దని, పునరాలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రణబ్కు సూచనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం ఆయనకు ఓ సూచన చేశారు. ఆయనను ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లనివ్వాలన్నారు. అయితే, అక్కడ ఆరెస్సెస్ చేసే తప్పులను ఆయన ఎత్తి చూపాలన్నారు.

ఆర్ఎస్ఎస్ ఆహ్వానానికి ప్రణబ్ ఇప్పటికే ఒప్పుకున్నారని, ఎందుకు ఒప్పుకున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం కాదని, అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే... సర్ (ప్రణబ్) అక్కడికి వెళ్లండి.. వారి భావజాలంలో ఏయే తప్పులున్నాయో చెప్పండని చిదంబరం సూచించారు.
అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల మాట్లాడుతూ.. ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తమను ఆస్చర్యానికి గురి చేసిందన్నారు. అయితే ఆరెస్సెస్ వంటి జాతీయ భావాలు కలిగిన సంస్థ సమావేశాలకు గతంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి కూడా హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications