ఏపీలో సక్సెస్తో టీఎంసీతో కలిసిన పీకేకు బీజేపీ కౌంటర్.. ఆయన స్కూల్ కు అమిత్ షా ప్రిన్సిపల్!
రాజకీయ వ్యుహకర్తగా ప్రశాంత్ కిషోర్ను బెంగాల్ ముఖ్యమంత్రి ,తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, అయిన మమతా బెనర్జీ నియమించుకున్ననేపథ్యంలో ఆయనపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా రానున్న ఎన్నికల్లో మమతా బెనర్జీ లాంటీ నేతలు వ్యుహకర్తలను నియమించుకోవడంతో దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. ఈనేపథ్యంలోనే బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్వర్గీయ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ప్రతి రాజకీయ వ్యుహాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా వద్ద నేర్చుకున్నారని అన్నారు..
ఈనేపథ్యంలోనే రాజకీయ కళాశాలలో బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రిన్సిపల్ అయితే... ప్రశాంత్ కిషోర్ ఓ స్టూడెంట్ అని అభివర్ణించారు. దీంతో అమిత్ షా ను మించిన వ్యుహకర్త ఎవరు లేరని అన్నారు.కాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ వ్యుహాలు తెలియకనే ఇతర వ్యుహకర్తను నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటీ పరిస్థితుల్లో రాష్ట్ర్రానికి సిఎంగా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.కాగా ప్రజలు మమతా బెనర్జీకి సంబంధించిన విషయాలను ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
ఇక ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోడికి 2015లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యుహకర్తగా ఉన్నారు. కాగా ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయు తీర్థం పుచ్చుకున్నారు.