లేడీ టెక్కీ ఆత్మహత్యకు ఇవే అసలుకారణాలు
బెంగళూరు: కార్యాలయం కట్టడం మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు శోభా (30) ఆత్మహత్య కేసు దర్యాప్తులో పలు సాక్షాలు సేకరించామని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.
మండ్యకు చెందిన శోభా చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కష్టపడి విద్యాభ్యాసం చేసింది. తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన శోభా తల్లితో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటున్నది.

ఇక్కడి వైట్ ఫీల్డ్ లోని హార్యాన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శోభా కుటుంబ సమస్యలతో విసిగిపోయిందని ఆమె తల్లి చెప్పారని పోలీసు అధికారులు అన్నారు. మండ్యలో శోభా తండ్రి పేరు మీద ఆస్తులు ఉన్నాయి.
తండ్రి మరణించిన తరువాత ఇప్పటి వరకు శోభా కుటుంబ సభ్యులకు ఆ ఆస్తులు ఇవ్వలేదు. ఆస్తుల పంపకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి బంధువులతో శోభాకు వివాదం ఉందని, కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఇదే కారణంతో జీవితంపై విరక్తి చెందిన శోభా గురువారం ఆమె పని చేస్తున్న కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని, ప్రాథమిక విచారణలో ఆస్తుల గొడవ విషయం వెలుగు చూసింది పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications