నేడు విభజన్ విభిషిక స్మృతి దివస్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. త్రివర్ణ పతాకాన్ని చూడటం పట్ల ఉన్న ఉత్సాహాన్ని హైలైట్ చేస్తూ.. ఈ క్షణం 1.4 బిలియన్లకు పైగా భారతీయుల జాతీయ గర్వం, ఐక్యతను సూచిస్తుందనివ్యాఖ్యానించారు.

'మనం వివిధ పండుగలను మా కుటుంబాలతో జరుపుకున్నట్లే.. మన తోటి పౌరులతో కూడిన కుటుంబంతో కలిసి మన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆగస్టు 15న, దేశంలోని అన్ని ప్రాంతాలలో, విదేశాలలో భారతీయులు జెండా పండగలో పాల్గొంటారు. దేశభక్తి గీతాలు పాడటం, చిన్నపిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వారు మన గొప్ప దేశం గురించి, దాని పౌరసత్వం గురించి మాట్లాడటం విన్నప్పుడు, వారి మాటలలో మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల ప్రతిధ్వని కనిపిస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి కలలు, రాబోయే సంవత్సరాల్లో దేశం దాని పూర్తి వైభవాన్ని తిరిగి పొందే వారి ఆకాంక్షలను బంధించే గొలుసులో మనం భాగమని అప్పుడు గ్రహిస్తాము' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

President Draupadi Murmu s 78th Independence Day Speech

స్వాతంత్ర్య సమరయోధులను సన్మానం

స్వాతంత్ర్య సమరయోధుల అపారమైన త్యాగాలు, ధైర్యసాహసాలకు గుర్తుగా రాష్ట్రపతి ముర్ము నివాళులర్పించారు. శతాబ్దాల నిద్ర నుంచి భారతదేశ స్ఫూర్తిని మేల్కొల్పడానికి ఈ దేశభక్తి గల ఆత్మలు ఎలా గొప్ప త్యాగాలు చేశారో ఆమె ప్రస్తావించారు. "ఈ చరిత్ర గొలుసుకు మనం బంధులమని గ్రహించడం వినయం. ఇది దేశం పరాయి పాలనలో ఉన్న రోజులను గుర్తుకు తెస్తుంది. దేశభక్తులు, ధైర్యవంతులు అపారమైన, అత్యున్నత త్యాగాలు చేశారు. వారి స్మృతికి మనం వందనం చేస్తున్నాం. వారికి అనేక ధన్యవాదాలు. భారతదేశ ఆత్మ శతాబ్దాల హింస నుంచి మేల్కొంది అని రాష్ట్రపతి తెలిపారు.

మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో విభిన్న సంప్రదాయాలను ఏకం చేసిన అనేక మంది వ్యక్తులను కూడా ఆమె హైలైట్ చేశారు. ఈ దేశవ్యాప్త ఉద్యమంలో అన్ని సంఘాలు పాల్గొన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ఆగస్టు 14 విభజన్ విభిషిక స్మృతి దివస్‌

భగవాన్ బిర్సా ముండా జయంతిని భారతదేశం జనజాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకోవడం ప్రారంభించిందని రాష్ట్రపతి చెప్పారు. వచ్చే ఏడాది 150వ జయంతి వేడుకలు జాతీయ పునరుజ్జీవనానికి ఆయన చేసిన కృషిని మరింత గౌరవిస్తాయి. లక్షలాది మంది బలవంతపు వలసలకు గురవుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విభజన భయాందోళనలను గుర్తుంచుకోవడానికి ఆగస్టు 14ని విభజన్ విభిషిక స్మృతి దివస్‌గా పాటిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.

దాదాపు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లతో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని ప్రెసిడెంట్ ముర్ము తన ప్రసంగంలో ప్రశంసించారు. "ఈ సంవత్సరం మన దేశంలో సాధారణ ఎన్నికలు జరిగినందున, అర్హత కలిగిన ఓటర్ల సంఖ్య దాదాపు 97 కోట్లకు చేరుకుంది. ఇది ఒక చారిత్రాత్మక రికార్డు, ఇది మానవజాతి ఎన్నడూ చూడని అతిపెద్ద ఎన్నికల కసరత్తుగా నిలిచింది. భారత ఎన్నికల కమిషన్‌ను అభినందించాలి. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సజావుగా, ఎలాంటి దోషరహితంగా నిర్వహించిన, అందుకు సహకరించిన అధికారులు, భద్రతా సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

'ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు.. అది ప్రజాస్వామ్య ఆలోచనకు ప్రతిధ్వనిస్తుంది. భారతదేశం విజయవంతంగా ఎన్నికలను నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులను బలపరుస్తుంది' రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యానించారు. మరోవైపు, సంక్షేమ పథకాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

పేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్ గార్ ఆధారిత్ జనకళ్యాణ్ (PM-SURAJ), ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) సహా అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను రాష్ట్రపతి ముర్ము వివరించారు. ముఖ్యంగా గిరిజనుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన స్కీమ్‌లను ప్రస్తావించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకర పనుల్లో పాల్గొనకుండా చూసుకోవడం, వ్యర్థాలను మానవులు తొలగించకుండా రక్షించేందుకు తీసుకొచ్చిన నమస్తే పథకం గురించి చర్చించారు.

భారతీయ సమాజంలో మహిళలను సమానంగా చూస్తున్నప్పటికీ.. సంప్రదాయ పక్షపాతాలు కొనసాగుతున్నాయని ద్రౌపదీ ముర్ము గుర్తు చేశారు. గత దశాబ్దం నుంచి మహిళా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచినట్లు తెలిపారు. స్త్రీ కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచడానికి, మెరుగైన లింగ నిష్పత్తికి దారితీసిందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోందన్నారు. మహిళా సాధికారతకు నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ చట్టం) ఒక ముఖ్యమైన అడుగు అని రాష్ట్రపతి పర్కొన్నారు.

సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం ఎదగడాన్ని ప్రశంసించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లో పారదర్శకత పెరిగిందని, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలపడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, జెండా ఎగురవేత ఉత్సవాలు, దేశభక్తి గీతాలు ఆలపించడం, స్వీట్లు పంపిణీ చేయడం, చిన్న పిల్లలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా భారతీయులను ఎలా ఏకం చేస్తాయో చెబుతూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+