Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వగ్రామానికి ఇన్నాళ్ళకు కరెంట్..యుద్ధప్రాతిపదికన పనులు

ద్రౌపది ముర్ము పేరును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొద్దిరోజులకు ఆమె స్వగ్రామంలో విద్యుత్ వెలుగులు నిండనున్నాయి. ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామమైన ఉపర్‌బేదాలో గ్రామంలోని ప్రజలు విద్యుత్తు లేకుండా జీవిస్తున్నారని మీడియాలో కథనాలు రావడంతో ఒడిశా ప్రభుత్వం ఆదివారం విద్యుద్దీకరణ పనులను ప్రారంభించింది.

ద్రౌపది ముర్ము స్వగ్రామంలో విద్యుదీకరణ పనులు

ద్రౌపది ముర్ము స్వగ్రామంలో విద్యుదీకరణ పనులు

నివేదికల ప్రకారం, టాటా పవర్ నార్త్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అధికారులు మరియు కార్మికులు ముప్పై ఎనిమిది విద్యుత్ స్తంభాలు మరియు 900 మీటర్ల కేబుల్‌లు, కండక్టర్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్‌లతో ద్రౌపది ముర్ము స్వగ్రామంలో విద్యుదీకరణ పనులు చేపట్టారు. ముఖ్యంగా, కుసుమి బ్లాక్‌లోని ఉపర్‌బేదా గ్రామంలో బాదసాహి మరియు దుంగురిసాహి అనే రెండు గ్రామాలున్నాయి. బాదాసాహి పూర్తిగా విద్యుదీకరించబడినప్పటికీ, దుంగురిసాహి ఇంకా విద్యుత్తు అందలేదు. దుంగురిసాహిలో నివసిస్తున్న సుమారు 20 కుటుంబాలకు నేటికీ విద్యుత్‌ కనెక్షన్‌ లేకపోవడంతో వారు చీకట్లో కిరోసిన్‌ దీపాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రకటించిన క్రమంలో గ్రామానికి విద్యుత్ వెలుగులు

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రకటించిన క్రమంలో గ్రామానికి విద్యుత్ వెలుగులు

నివేదికల ప్రకారం, గ్రామంలోని స్థానికులు తమ మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ కోసం చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాలకు వెళతారు. ఇక ద్రౌపది ముర్ము మేనల్లుడు బిరంచి నారాయణ్ తుడు తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి దుంగురిసాహి గ్రామంలో నివసిస్తున్నాడు, దుంగురిసాహికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. అయితే, స్థానిక ప్రజల ఆగ్రహంతో పాటు, ప్రస్తుతం ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామంలో విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేసే పనులను ప్రారంభించిందని అంటున్నారు .

ద్రౌపది ముర్ము వల్లే కరెంట్ వస్తుందని గ్రామస్తుల ఆనందం

ద్రౌపది ముర్ము వల్లే కరెంట్ వస్తుందని గ్రామస్తుల ఆనందం

ప్రస్తుతం ద్రౌపది ముర్ము ఆ గ్రామంలో నివసించడం లేదు. ఆమె తన స్వగ్రామమైన ఉపర్‌బేదాలోని దుంగురిసాహి నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురపాలక పట్టణమైన రాయంగ్‌పూర్‌లో ఆమె నివసిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా విద్యుదీకరణ పనులు చేపట్టటంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ద్రౌపది ముర్ము వల్లే కరెంట్ వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. కాగా, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని రాజ్యసభ సెక్రటరీ జనరల్ మరియు రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో ముర్ము తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+