వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ సంచలన నిర్ణయం: అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు భేటీ.. రీజన్ ఏంటంటే!!

|
Google Oneindia TeluguNews

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు సమావేశం కానున్నారు. ఏప్రిల్ 27వ తేదీన బుధవారం రోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న ప్రధాని నరేంద్ర మోడీ కరోనా మహమ్మారి కేసుల పెరుగుదల నేపధ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెరుగుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏప్రిల్ 27న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

భారత్ లో కరోనా వ్యాప్తి: మళ్ళీ నిబంధనల దిశగా రాష్ట్రాలు; తాజా పరిస్థితి ఇదే!!భారత్ లో కరోనా వ్యాప్తి: మళ్ళీ నిబంధనల దిశగా రాష్ట్రాలు; తాజా పరిస్థితి ఇదే!!

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం ..పాల్గొననున్న కేంద్ర మంత్రులు

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం ..పాల్గొననున్న కేంద్ర మంత్రులు


ప్రధాని వివిధ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించే ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు వారి సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిపై ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారని నివేదించబడింది.

రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై మోడీ సమావేశం

రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై మోడీ సమావేశం


ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి, ముఖ్యంగా బూస్టర్ డ్రైవ్ మరియు కొన్ని రాష్ట్రాల్లో కేసుల పరిస్థితిని గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. వివిధ రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు గతంలో ప్రధాని మోదీ సీఎంలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్న తీరు, రాష్ట్రాలలో మాస్కులు పెట్టుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు.

దేశంలో కరోనా ఆందోళన.. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ ల వల్ల పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా ఆందోళన.. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ ల వల్ల పెరుగుతున్న కేసులు

ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు గత కొద్ది రోజుల నుండి 2 వేలకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 2,483 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 2,541 కేసుల కంటే కొంచెం తక్కువగా నమోదయ్యాయి. క్రియాశీల కేసులు కూడా 16,522 నుండి 15,636కి తగ్గాయి. అయితే పాజిటివిటీ రేటు 0.55 శాతంగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల కరోనా వ్యాప్తి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.

English summary
In view of the growing trend of corona cases in the country, Prime Minister Narendra Modi will hold a review meeting with the Chief Ministers of all the states on April 27 tomorrow via video conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X