PM Rozgar Yojana: కొలువుల పండుగ! ఒక్కరోజే 51 వేల మందికి సర్కారీ ఉద్యోగాలు..

దేశవ్యాప్తంగా వేలాది నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపేలా కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 20వ 'రోజ్‌గార్ మేళా' వేదికగా దేశవ్యాప్తంగా ఒక్క రోజే 51 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను నూతన అభ్యర్థులకు అందజేసింది. ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' కాలాన్ని సాకారం చేయడంలో నూతనంగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

భారతీయ యువత నైపుణ్యం, సృజనాత్మకత నేడు ప్రపంచ దేశాల నమ్మకాన్ని గెలుచుకుందని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. మన నూతన ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయంగా భారత్ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నారని ప్రశంసించారు. ఇటీవల నిర్వహించిన బ్రిక్స్ (BRICS) సదస్సులో కూడా కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా యువత, పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేసేలా 'బ్రిక్స్ కనెక్ట్', 'బ్రిక్స్ ఎంఎస్ఎంఈ పోర్టల్' వంటి వేదికలను తీసుకొచ్చామని వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 40 దేశాలతో చేసుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలు (FTAs) మన అభ్యర్థులకు సరికొత్త గ్లోబల్ అవకాశాలను తలుపులు తీస్తున్నాయని తెలిపారు.

Prime Minister Narendra Modi Distributes Over 51 000 Appointment Letters In 20th Rozgar Mela Event Across India

స్టార్టప్ ప్రపంచంలో అదరగొడుతున్న చిన్న నగరాలు!

కేవలం సర్కారీ ఉద్యోగాలే కాకుండా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ నెట్‌వర్క్‌గా భారత్ అవతరించిందని, విశేషమేమిటంటే ఇందులో సగానికి పైగా స్టార్టప్‌లు టెయిర్-2, టెయిర్-3 నగరాలు, పట్టణాల నుంచే నడుస్తున్నాయని వివరించారు. గ్రామీణ నేపథ్యం ఉన్న యువత సొంతంగా ఆలోచించి కంపెనీలు స్థాపించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుండటం కొత్త భారత్ బలానికి నిదర్శనమని అభివర్ణించారు. రూ. 60 వేల కోట్ల వ్యయంతో 1,000 ఐటీఐ (ITI)లను ఆధునీకరిస్తూ 'పీఎం సేతు' కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్టంగా రూ. 80,000 వరకు సహాయం: ప్రధాని మోదీ
ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్టంగా రూ. 80,000 వరకు సహాయం: ప్రధాని మోదీ

ప్రైవేట్ ఉద్యోగాలకు 'లక్ష కోట్ల' ఉద్దీపన!

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ మునుపెన్నడూ లేని రీతిలో అవకాశాలు పెంచేందుకు 'ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన'ను దాదాపు రూ. లక్ష కోట్లతో అందుబాటులోకి తెచ్చినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత మొదటిసారి కార్మిక శక్తిలోకి అడుగుపెట్టనున్నారు. మొదటి ఉద్యోగం సాధించిన యువతకు ప్రభుత్వం తరఫున రూ. 15,000 వరకు ప్రోత్సాహకం అందించడంతో పాటు, కొత్త ఉద్యోగాలు కల్పించే సంస్థలకు కూడా సబ్సిడీలు అందిస్తున్నామని వివరించారు.

మోదీ పుట్టినరోజు వేళ 88 లక్షల ప్రమిదలతో వెలుగుల పండుగ! కాశీకి చంద్రబాబు
మోదీ పుట్టినరోజు వేళ 88 లక్షల ప్రమిదలతో వెలుగుల పండుగ! కాశీకి చంద్రబాబు

దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో పండుగ వాతావరణం

శనివారం దేశంలోని 45 ప్రాంతాల్లో ఈ రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. రైల్వే, హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, ఆరోగ్యం వంటి వివిధ కీలక శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు నిర్వహించిన 20 రోజ్‌గార్ మేళాల ద్వారా మొత్తం 12.75 లక్షల మంది యువతకు నియామక పత్రాలు అందించినట్లయింది. పూణే, ఢిల్లీ తదితర కేంద్రాల్లో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొని అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందించడంతో ఆయా ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని తలపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+