వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
"వాళ్లను చూస్తుంటే బాధేస్తోంది.. కశ్మీర్ను మరో సిరియాగా మారనివ్వం"
కల్లోలం లేని ప్రశాంత కశ్మీర్ను రూపొందించడమే తన తక్షణ లక్ష్యమని నూతనంగా నియమించబడిన జమ్ము-కశ్మీర్ చర్చల ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మ తెలిపారు.కశ్మీర్ను మరో సిరియాగా మారనివ్వబోమని స్పష్టం చేశా
న్యూఢిల్లీ: కల్లోలం లేని ప్రశాంత కశ్మీర్ను రూపొందించడమే తన తక్షణ లక్ష్యమని నూతనంగా నియమించబడిన జమ్ము-కశ్మీర్ చర్చల ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మ తెలిపారు.కశ్మీర్ను మరో సిరియాగా మారనివ్వబోమని స్పష్టం చేశారు.
యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మూకశ్మీర్ లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాభిప్రాయం మేరకు సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
తప్పుదోవ పట్టిన కశ్మీర్ యువతను చూస్తుంటే బాధ కలుగుతోందని ఈ సందర్భంగా దినేశ్వర్ అన్నారు. భవిష్యత్తులో దీనికి అడ్డుకట్ట వేయడానికి శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతీ ఒక్కరితో చర్చిస్తామన్నారు. హింసకు సాధ్యమైనంత త్వరగా స్వస్తి పలకడమే తమ లక్ష్యమని అన్నారు. యువత తప్పుదోవ పడితే సమాజమే నాశనం అవుతుందన్నారు.
Comments
English summary
The biggest challenge and the top priority in Kashmir are to deradicalize Kashmiri youth and militants and prevent it from turning into a Syria of India, says Dineshwar Sharma,
Story first published: Friday, October 27, 2017, 17:45 [IST]