ఫీజు బాదుడు: ప్రైవేట్ స్కూల్స్కు పర్మిషన్, ఏప్రిల్, మే నెల ట్యూషన్ పీజు వసూల్కు ఓకే..
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల పని లేకపోవడంతో ఫీజు వసూల్ చేయొద్దని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతం చండీఘడ్ మాత్రం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు వసూల్ చేసుకోవచ్చని చెప్పింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు సర్కార్ స్పందించింది.
ఇతర చోట్ల అయితే జీతాలు తగ్గించుకొని, ఖర్చులు తక్కువ చేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ చండీఘడ్ మాత్రం ఫీజు కలెక్ట్ చేయడానికి అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శల వ్యక్తమవుతున్నాయి. అయితే క్వార్టర్లీ కాకుండా నెలవారీగా ట్యూషన్ ఫీజు కలెక్ట్ చేయాలని మాత్రం చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో పేరంట్స్ కూడా కొంత ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.

చండీఘడ్ ప్రభుత్వాన్ని ఇండిపెండెంట్ స్కూల్ అసోసియేషన్ విన్నవించింది. తమ సిబ్బందికి జీతం ఇవ్వాలని, ఇతర ఖర్చులు ఉన్నాయని తెలిపింది. వారి సమస్యకు స్పందించి.. ఫీజు వసూల్ చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే ఫైన్ వేయొద్దని మాత్రం తేల్చిచెప్పింది. మే 31 వరకు అవకాశం ఇవ్వాలని.. ఏప్రిల్, మే నెల ట్యూషన్ మాత్రమే కలెక్ట్ చేయాలని తేల్చిచెప్పింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications