చంద్రశేఖర్ ఆజాద్ను పరామర్శించిన ప్రియాంకా గాంధీ..ఎవరీయన..?
మీరట్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన భీమ్ ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజ్బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి ఆజాద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ప్రియాంకా గాంధీ పరామర్శించారు.
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆజాద్ను అతని అనుచరులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మోటార్ సైకిల్ను ప్రచారం కోసం వినియోగించారనే అభియోగం వీరిపై మోపారు. అరెస్టు తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను మీరట్లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడే ఆయన్ను అడ్మిట్ చేయడం జరిగింది.

ముజఫర్ నగర్లో మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టాలని భావించిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అతనిపై ఎన్నికల నిబంధన కోడ్ ఉల్లంఘించారనే అభియోగం మోపారు. ఆజాద్ కలిసిన తర్వాత ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని దీన్ని పెద్దదిగా చేసి చూపించొద్దని ప్రియాంకాగాంధీ అన్నారు. ఈ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ప్రియాంకా ధ్వజమెత్తారు. యువత గొంతుకను అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని ప్రియాంకా మండిపడ్డారు.
Meerut: Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra meets Bhim Army chief Chandrashekhar who is undergoing treatment at a hospital. pic.twitter.com/e4QPUJolzW
— ANI UP (@ANINewsUP) March 13, 2019
అంతకుముందు అంటే శనివారం రోజున మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ ఆజాద్.... మహాగట్భంధన్ మోడీ, స్మృతీ ఇరానీలపై ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టకుంటే... భీమ్ ఆర్మీనే ఆ బాధ్యత తీసుకుని వీరిపై అభ్యర్థులను బరిలోకి నింపుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాక ప్రియాంకా గాంధీ మోడీ ఇలాఖాలోనే ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications