ఉజ్జయినిలో ప్రియాంక ప్రత్యేక పూజలు..!ఆరో విడతలో బీజేపికి ఓటు శాతం తగ్గిందన్న ఇందిర మనవరాలు..!!
ఉజ్జయిని/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల ఏడో విడత ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ నేడు ఉజ్జయినిలో పర్యటించారు.
ఈ సందర్భంగా మహాకాళేశ్వర ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు గంటకు పైగా ప్రియాంక పూజలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్నాథ్, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. అనంతరం ఉజ్జయినిలో జరిగిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో మెజారిటీ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉజ్జయిని లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాబులాల్ మాలవ్యా బరిలో నిలిపింది. ఏడో విడతలో భాగంగా మే 19న ఉజ్జయినిలో పోలింగ్ జరగనుంది.
సార్వత్రిక సమరం చివరి దశకు చేరింది. ఒక్కో విడత ముగుస్తున్నకొద్దీ పోరు పెరుగుతోంది. సమరం రసవత్తరంగా మారుతోంది. అయితే గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన బీజేపీకి ఇప్పుడు ఆ స్థాయిలో జోష్ కనిపించడంలేదు. కానీ చివరి రెండు విడతలమీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆరోవిడత పోలింగ్ ముగిసింది. కానీ ఇక్కడ బీజేపీకి ఎదురుగాలి వీచిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది కేవలం చివరి విడత మాత్రమే. ఆరో విడతతో దాదాపు 483 స్థానాల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇక మిగిలింది 59 స్థానాలు మాత్రమే.
आज कांग्रेस महासचिव @priyankagandhi ने उज्जैन के महाकालेश्वर मंदिर में पूजा-अर्चना करके भगवान शिव से देश की समृद्धि और अमन-चैन की प्रार्थना की। pic.twitter.com/ni7kjSLb6I
— Congress (@INCIndia) May 13, 2019
అయితే ఇప్పటి వరకు ట్రెండ్ ఎటువైపు ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయపార్టీలు కీలకం కాబోతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అటు బీజేపీకి గతంలో కంటే సగం స్థానాలు తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్తిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ 118 స్థానాలపై భారీ ఆశలు పెట్టుకుంది. నిజానికి ఆరో విడతలో ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో బీజేపీ 2014లో ఏకంగా 44 సీట్లు సాధించింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్పుకొస్తున్నారు.