హింసతో గెలవలేరు.. మోదీ ఇలాకాలో ప్రియాంక.. బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ
Recommended Video
అహింస పునాదులపై ఏర్పడ్డ దేశంలో హింసను ఒక సాధనంగా వాడేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఈస్ట్ యూపీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. హింసతో ఎవరూ దేన్నీ గెలవలేరని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సోంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ఆమె.. తొలిసారి బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు.
వర్సిటీలపై దాడులు..
ఉదయం ఢిల్లీ నుంచి వారణాసికి విమానంలో వచ్చిన ప్రియాంక.. ఎయిర్ పోర్టు నుంచి బెనారస్ వర్సిటీ వరకు గంగా నదిలో బోటులో ప్రయాణించారు. ప్రియాంకను చూసేందుకు నది ఒడ్డున జనం బారులు తీరారు. వర్సిటీ ఆవరణలో విద్యార్థులతోపాటు వారణాసి సిటీ ప్రముఖులు, స్వచ్ఛంద కార్యకర్తలతోనూ ఆమె మాట్లాడారు. జేఎన్యూలో హింసను ప్రస్తావిస్తూ వర్సిటీలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నదని మండిపడ్డారు.

బాధితులకు ఓదార్పు..













Click it and Unblock the Notifications