వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజా మాజీ సీఎంకు భారీ షాక్ -పుదుచ్చేరి అసెంబ్లీ కాంగ్రెస్ జాబితాలో నారాయణస్వామికి మొండిచెయ్యి

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు కోలాహలంగా సాగుతున్నాయి. అన్నాడీఏంకేతో కలిసి బీజేపీ కొత్త ఎత్తులు వేస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గతంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా మాసీ సీఎం వి. నారాయణస్వామిని ఏకంగా ఎన్నికల బరి నుంచి పక్కకు తప్పించింది.

పుదుచ్చేరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు గానూ కాంగ్రెస్ పార్టీ మొత్తం 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. అందులో తాజా మాజీ సీఎం నారాయణస్వామి పేరు లేదు. దీంతో కార్యకర్తలు, ఆయన వర్గీయులు ఆందోళనకు గురయ్యారు. చావు కబురు చల్లగా తరహాలో కాస్త ఆలస్యంగా దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ వివరణ ఇచ్చింది.

viral video: ఒక్క దెబ్బతో తల్లిని చంపేశాడు -అందరి ఇళ్లలో గొడవలాగే మొదలై..viral video: ఒక్క దెబ్బతో తల్లిని చంపేశాడు -అందరి ఇళ్లలో గొడవలాగే మొదలై..

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం నారాయణస్వామి బరిలోకి దిగడం లేదని, అందుకే అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదని పుదుచ్చేరి ఏఐఐసీ ఇన్‌చార్జి దినేష్‌ గుండురావు మీడియాకు తెలిపారు. అయితే, ప్రచార బాధ్యతల నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ నారాయణస్వామే దగ్గరుండి చూసుకుంటారని గుండూరావు క్లారిటీ ఇచ్చారు. ఈసారి..

 Puducherry polls: Former chief minister V Narayanasamy’s name missing from Congress list

మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్దిరోజుల ముందు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ డీఎంకే(మిత్రపక్షం) ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయింది.

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రులైన డీఎంకే 13 చోట్ల, సీపీఐ 1, వీసీకే 1 స్థానంలో బరిలోకి దిగాయి. కాంగ్రెస్ కోటాలోని మరో సీటుకు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

English summary
Former Puducherry chief minister V Narayanasamy’s name was missing from the list of 14 candidates announced by the Congress party on Tuesday. The Congress is contesting in 15 of the 30 assembly constituencies. The candidate for Yanam, an enclave of Puducherry in Andhra Pradesh, is yet to be be announced. The remaining seats are shared by alliance partners DMK (13), CPI (1) and VCK (1).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X