వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూకంపం: బెంగాల్‌లో ఆరుబయటే పరీక్ష రాసిన విద్యార్ధులు...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: నేపాల్‌లో తాజాగా సంభవించిన భూప్రకంపనలు ప్రభావం భారత్‌పై కూడా పడింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఓపాఠశాలలో విద్యార్ధులు పరీక్ష రాస్తుండగా భూమి కంపించింది. దీంతో ఆందోళనకు లోనైన ఉపాధ్యాయులు వెంటనే విద్యార్ధులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపించారు.

భూ ప్రకంపనలు ఆగిన తర్వాత ఉపాధ్యాయులు ఆరు బయటే విద్యార్ధుల చేత పరీక్ష రాయించారు. ఈరోజు మధ్యాహ్నాం భారత్‌లోని ఢిల్లీ, బీహార్, పశ్చిమబెంగాల్, అసోం, పంజాబ్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్‌లో తీవ్ర భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే.

Punjab School Education Board (PSEB) Class 12 results announced

మంగళవారం మధ్యాహ్నం 12.38 గంటలకు 60 సెకన్లపాటు భూమి కంపించడంతో భయాందోళనకు లోనైన ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో భూ ఉపరితలానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం అధీకృతమైనట్టు భూగర్భశాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే సోమవారం వెలువడిన పంజాబ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే బాలికలే మెరుగైన ప్రతిభను ప్రదర్శించారు. పంజాబ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌ తేజిందర్‌ కౌర్‌ ధలివాల్‌ మాట్లాడుతూ ఫలితాల్లో 76.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో బాలికలే నిలిచారు.

English summary
Girls bagged the top three positions in the merit list of Punjab School Education Board (PSEB) Class XII annual exam, the result of which was declared on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X