పూరీ రథయాత్రలో అపశృతి: ఒకరి మృతి, వందల మందికి గాయాలు
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది భక్తులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని నలు మూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ 'జై జగన్నాథ' నినాదాలతో మార్మోగాయి. ఆదివారం సాయంత్రం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర వారి రథాలు నందిఘోష, తాళధ్వజం, పధ్వధ్వజం రథాలపై తల్లి చెంతకు పయనమయ్యారు.

తొలుత బలభధ్రుడు తాళధ్వజ రథంపై తల్లి చెంతకు పయనమయ్యారు. ఆ తర్వాత దేవీ సుభద్రదేవీ, చివరిగా పురుషోత్తముని నందిఘోష్ రథం భక్త జన సాగరంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. భక్తజన ఘోష మధ్య పూరీ బొడొదండోలో జగన్నాథుడు దర్శనమిచ్చారు.
#WATCH | Large number of devotees gather in Odisha's Puri to take the darshan of Lord Jagannath as the two-day Lord Jagannath Rath Yatra to commence today. pic.twitter.com/C1qFOnLn6e
— ANI (@ANI) July 7, 2024
రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పూరీ జగన్నాథ రథయాత్ర తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. మూడు రథాల 'పరిక్రమ' చేసి దేవతలకు నమస్కరించారు. ఒడిశా ముఖ్యమంత్రి చరణ్ మాఝీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి లాంఛనప్రాయంగా యాత్ర ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొని భక్తపారవశ్యులయ్యారు.
#WATCH | Odisha | Puri Maharaja sweeps chariots as part of Rath Yatra rituals.
— ANI (@ANI) July 7, 2024
Dibyasingha Deb, the Gajapati Maharaja of Puri, sweeps the chariots of Lord Jagannath and his siblings - Balabhadra and Goddess Subhadra before they are ceremoniously pulled by devotees.
(Source -… pic.twitter.com/i62KTQ05Bv
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications