RAC టికెట్కు ఫుల్ ఛార్జీ ఎందుకు? పార్లమెంట్ షాక్!
రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటు చేసుకుంది. రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (RAC) కేటగిరీ కింద ప్రయాణించే ప్రయాణికుల నుంచి పూర్తి టికెట్ ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) స్పష్టం చేసింది. ఈ విధానాన్ని వెంటనే సవరించి, RAC ప్రయాణికులకు పాక్షికంగా ఛార్జీలను తిరిగి చెల్లించేలా నిబంధనలు రూపొందించాలని రైల్వే మంత్రిత్వ శాఖకు కమిటీ సూచించింది.
ప్రస్తుతం RAC టికెట్ ఉన్న ప్రయాణికులు ఒకే బెర్త్ను ఇద్దరు పంచుకోవాల్సి వస్తోంది. వ్యక్తిగత బెర్త్ సౌకర్యం లేకపోయినా, పూర్తి ఛార్జీ వసూలు చేయడం సరైన విధానం కాదని కమిటీ అభిప్రాయపడింది. చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా RACలోనే ఉండిపోయే ప్రయాణికులకు ఇది స్పష్టమైన అన్యాయమని నివేదికలో పేర్కొంది. 'ఇండియన్ రైల్వేస్లో రైళ్ల సమయపాలన మరియు ప్రయాణ సమయం' అనే అంశంపై PAC రూపొందించిన ఈ నివేదికను తాజాగా పార్లమెంటుకు సమర్పించింది. RAC ప్రయాణికుల విషయంలో రైల్వేలు తీసుకుంటున్న ప్రస్తుత విధానం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

సూపర్ఫాస్ట్ రైళ్లపై కూడా ప్రశ్నలు
RAC అంశంతో పాటు, సూపర్ఫాస్ట్ రైళ్ల వర్గీకరణపై కూడా కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సూపర్ఫాస్ట్గా గుర్తించేందుకు అమల్లో ఉన్న 55 కిలోమీటర్ల సగటు వేగ ప్రమాణం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. 2007 నుంచి ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పు జరగలేదని నివేదిక వెల్లడించింది. బ్రాడ్ గేజ్పై రైలు సగటు వేగం కనీసం 55 kmph ఉంటే సూపర్ఫాస్ట్గా పరిగణించే నిబంధన ప్రకారం ప్రస్తుతం 478 రైళ్లు ఆ కేటగిరీలో ఉన్నాయి. అయితే, వాటిలో 123 రైళ్ల వేగం 55 kmph కన్నా తక్కువగా ఉందని కమిటీ గుర్తించింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తాజా డేటా ప్రకారం 47 రైళ్లు మాత్రమే 55 kmph కంటే ఎక్కువ వేగంతో నడుస్తున్నాయని తెలిపింది. మిగతా రైళ్ల వేగం తగ్గడానికి అదనపు స్టాప్లు, మార్గమధ్య ఆపరేషన్లు కారణమని వివరణ ఇచ్చింది.
"సూపర్ఫాస్ట్" పేరుతో అధిక ఛార్జీలే లక్ష్యమా?
అయితే, కమిటీ అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది. రైళ్లను సూపర్ఫాస్ట్గా కొనసాగించడంలో అసలు ఉద్దేశ్యం అధిక ఛార్జీలు వసూలు చేయడమేనని నివేదికలో పేర్కొంది. ఒకసారి రైలు వేగం తగ్గితే, వెంటనే దాన్ని సూపర్ఫాస్ట్ కేటగిరీ నుంచి తొలగించి, ఛార్జీలను తగ్గించాలని సూచించింది. 55 kmph ప్రమాణం ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా అనర్హమని కమిటీ అభిప్రాయపడింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో రైళ్లు చాలా అధిక వేగంతో నడుస్తున్నాయని ఉదాహరణగా చూపింది. భారతదేశంలో కూడా సూపర్ఫాస్ట్ రైళ్ల సగటు వేగాన్ని కనీసం 100 kmphకు పెంచాలని సూచించింది.
కొత్త రైళ్లకన్నా సమయపాలన ముఖ్యం
2030 నాటికి రైళ్లు కేవలం చివరి స్టేషన్ వద్ద మాత్రమే కాకుండా, మొత్తం ప్రయాణంలో నిరంతరం 100 kmph వేగంతో నడవగలగాలని కమిటీ లక్ష్యంగా నిర్దేశించింది. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల పాత ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లకు ఆలస్యాలు పెరుగుతున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కొత్త రైళ్ల సంఖ్య పెంచడంకన్నా, ప్రస్తుతం ఉన్న రైళ్లను సమయపాలనతో నడపడానికి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
ప్రయాణికుల హక్కులపై దృష్టి
మొత్తంగా, ఈ నివేదిక రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల హక్కులపై గట్టి ప్రశ్నలు లేవనెత్తింది. RAC ప్రయాణికులకు న్యాయం చేయడం, సూపర్ఫాస్ట్ పేరుతో అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయడం, వేగ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం-ఇవన్నీ ఇక తప్పనిసరి మార్పులుగా మారుతున్నాయని స్పష్టమవుతోంది.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!












Click it and Unblock the Notifications