ఎపి, టిపై దృష్టి: కేంద్రమంత్రి, జగన్తో బ్రిటిష్ హైకమిషనర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సోమవారం అన్నారు. ఆయన బిజెపి కార్యాలయంలో పదాధికారులు, కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
హరిత, నీలి, పాల విప్లవాన్ని సాధిస్తామన్నారు. దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆరు నెలల్లోగా వ్యవసాయ భీమా తీసుకు వస్తామని, నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామని చెప్పారు. గుజరాత్ తరహాలో రైతులందరికీ భూసార కార్డులు ఇస్తామన్నారు.

వాజపేయి హయాంలో తీసుకు వచ్చిన నిర్ణయాల వల్లే పాల ఉత్పత్తిలో భారత దేశం మొదటి స్థానంలో ఉందన్నారు. రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ, అనుబంధ అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. రైతు సంపన్నంగా ఉండేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ వికాస యోజన కింద ప్రతి పంటకు నీరు అందిస్తామన్నారు.
కాగా, రాధామోహన్ సింగ్ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సాయంత్రం తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అవుతున్నారు.
రాష్ట్రాల సమస్యలపై కేంద్రం దృష్టి
రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పిఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూడు నెలలుగా పెండింగులో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూడాల్సి ఉందన్నారు.
జగన్ను కల్సిన బ్రిటిష్ హైకమిషనర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్ సోమవారం కలిశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications