నరేంద్రమోడీ, అమిత్ షా భావనలకు విరుద్ధంగా రాహుల్ గాంధీ?
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ఉపయోగించి కాంగ్రెస్ను భయపెట్టాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. తనతోపాటు ఇతర విపక్ష పార్టీల గొంతును నొక్కాలని వ్యూహరచన చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని సీజ్ చేయడంపై పార్టీ ఎంపీలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నేషనల్ హెరాల్డ్ విషయానికొస్తే అది పూర్తిగా బెదిరింపు చర్య అని, మాపై ఒత్తిడి తెస్తే మేం మౌనంగా ఉంటామని మోడీ, అమిత్ షా భావిస్తున్నారని, కానీ వారికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోడీ, అమిత్ షా ఏం చేసినా తమ నిర్ణయం మీద తాము నిలబడతామని రాహుల్ అన్నారు. దేశంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తన బాధ్యతను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఐదురోజుల్లో 50 గంటలపాటు ఈడీ విచారించింది. అనంతరం సోనియాగాంధీని విచారించింది. ఆమెను దాదాపు 100 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం.ఈడీ విచారణ పేరుతో పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల సమయానికి పార్టీని పూర్తిగా బలహీనం చేయాలనే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications