ఈ ప్రశ్నలకు బదులివ్వండి,ఎంతమంది చనిపోయారు, పరిహరమిచ్చారా ?
ప్రధానమంత్రి మోడీకి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలను సంధించారు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఏ మేరకు నల్లధనం దేశంలో బయటపడిందో చెప్పాలని ఆయన కోరారు.
న్యూఢిల్లీ: ఎ.ఐ. సి. సి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రశ్నల వర్షం కురిపించాడు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఏం సాధించారో చెప్పాలని ఆయన ప్రధానిని కోరారు. పెద్ద నగదు నోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ ఇతర విపక్షాలను కూడగట్టి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది.
పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నవంబర్ 8వ, తేదిన నిర్ణయం తీసుకొండి.అయితే ఈ నిర్ణయం తర్వాత ఏం సాధించారని ఆయన ప్రధానమంత్రి మోడీని ఆయన ప్రశ్నించారు. యాభై రోజుల గడువు డిసెంబర్ 30,వ తేదితో ముగిసింది.

మోదీకి ప్రశ్నలు సంధించిన రాహూల్ గాంధీ
1.నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత నల్లధనం ఎంత బయటపడిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.2. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా భారత్ ఎంత మేరకు ఆర్థికంగా నష్టపోయిందో చెప్పాలన్నారు. దీంతో పాటుగా ప్రజల ఆదాయ వనరులు ఏ మేరకు దెబ్బతిన్నాయో కూడ వివరించాలని ఆయన కోరారు.
3.పెద్ద నగదునోట్ల రద్దు వల్ల ఎంత మంది చనిపోయారు , వారికి ప్రభుత్వం పరిహరం చెల్లించిందా, చెల్లించకపోతే ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన కోరారు.4. పెద్ద నగదు నోట్లన రద్దుచేసే ముందుకు ప్రధాని ఏ నిపుణులను సంప్రదించారో చెప్పాలని ఆయన కోరారు.5. పెద్ద నగదు నోట్లను రద్దుచేయడానికి ముందుగా రెండు మాసాల్లో బ్యాంకుల్లో 25 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసిన వారి వివరాలను చెప్పాలని ఆయన కోరారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications