భద్రతను పట్టించుకోని రాహుల్ గాంధీ- రెండేళ్లలో 113 సార్లు ఉల్లంఘన-సీఆర్పీఎఫ్ రిపోర్ట్ !
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్రను చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా కేంద్రాన్ని అదనపు భద్రత కోరారు. తన జోడో యాత్రలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాహుల్ కు కల్పిస్తున్న భద్రతపై సీఆర్ఫీఎఫ్ నివేదిక కోరింది. దీంతో సీఆర్పీఎఫ్ తాజాగా కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో పలు సంచలన విషయాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ హోదాలో ఉన్న రాహుల్ గాంధీకి ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయితే భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలోనూ ఆయన పక్కనే సీఆర్పీఎఫ్ భద్రతను కూడా కల్పిస్తున్నారు. కానీ భారత్ జోడో యాత్రలో తాజాగా పలుమార్లు భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ దీనిపై స్పందించింది. రాహుల్ కు ప్రస్తుతం పూర్తిస్ధాయిలో భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రానికి తెలిపింది. ఎక్కడికక్కడ రాష్ట్ర పోలీసులతో, భద్రతా సంస్ధలతో సమన్వయం చేసుకుంటూ ఈ భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది.

అదే సమయంలో రాహుల్ గాంధీ సీఆర్పీఎఫ్ సూచించిన భద్రతా నిబంధనల్ని పలుమార్లు పాటించడం లేదని, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నట్ల కూడా హోంశాఖకు రాసిన లేఖలో సీఆర్పీఎఫ్ తెలిపింది. 2020 నుంచి చూసుకుంటే ఇప్పటివరకూ ఇలాంటి 113 ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు హోంశాఖకు వెల్లడించింది. వీటిపై రాహుల్ ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నట్లు కూడా తెలిపింది. దీనిపై సీఆర్పీఎఫ్ తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో రాహుల్ తాము చెప్పిన నిబంధనలు పాటించకుండా, జోడో యాత్రకు భద్రత అడుగుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications