Rahul Gandhi Disqualification: తెలంగాణలో మోదీ దిష్టి బొమ్మ దగ్ధం..!
లోక్సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తమ నాయకుడిపై అనర్హత వేటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ పలు రూపాల్లో మీదీ సర్కార్ పై నిరసన తెలిపింది. 2019లో మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న పిటిషన్పై సూరత్ కోర్టు విచారణ చేసి రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. రెండేళ్లు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడంటూ లోక్సభ సెక్రటేరియట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాడు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడాన్ని వారు తప్పుబట్టారు. మోదీ సర్కార్ ప్రశ్నించిన వారి గొంతును నొక్కేస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని కార్యకర్తలు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను కాంగ్రెస్ దగ్ధం చేసింది. ఖమ్మంలో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంభాని చంద్రశేఖర్ నేతృత్వంలో నిరసనలు తెలిపారు.రాహుల్ పై వేటు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క చెప్పారు.

Under the leadership of
— It's Nr _official (@NarendraPothur5) March 25, 2023
AICC member, TPCC Senior Vice President Sambhani Chandrashekar burnt an effigy of Prime Minister Modi in Sathupalli constituency, Khammam Dist, TELANGANA, Protesting the Cancellation of former AICC president Rahul Gandhi's membership of Parliament. pic.twitter.com/w30SfCRRMp
ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ముందు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ మాస్కులు ధరించి తమ నిరసన తెలిపారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, ఒకరికి తలవంచే ప్రసక్తే లేదని చెప్పే ఫ్లకార్డులను ప్రదర్శించారు. సత్యం కోసం గాంధీ కుటుంబం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లకార్డులను ప్రదర్శించారు.
Chandigarh youth Congress stopped the New Delhi-Chandigarh Shatabdi train at the Chandigarh railway station over the disqualification of Rahul Gandhi from Parliament.
— ANI (@ANI) March 25, 2023
Rahul Gandhi was a former MP from Wayanad. pic.twitter.com/ilVDlfVFoT
రాహుల్గాంధీపై అనర్హత వేటు వేయడంతో చండీగఢ్లో యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. న్యూఢిల్లీ-చండీగఢ్కు వెళ్లే శతాబ్ధి ఎక్స్ప్రెస్ను కాంగ్రెస్ నాయకులు నిలిపివేశారు. భోపాల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ప్రజాస్వామ్యంపై ప్రభుత్వం దాడి చేస్తుందని సింబాలిక్గా చెప్పేందుకు తమ నోళ్లకు తాళం వేసుకుని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications