రాహుల్కు మరో షాక్..నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ నోటీస్
ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసింది. అమేథీ నియోజకవర్గంలో రాహుల్ ఫోటోలతో కూడిన ఏడు బ్యానర్ల ఏర్పాటు చేసినట్లు ప్లయింగ్ స్క్వాడ్ బృందం గుర్తించింది. ఆ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం పేరుతో ఇప్పుడు న్యాయం జరుగుతుంది అన్న నినాదాలు బ్యానర్లపై రాసి ఉండటంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని రాహుల్ను ఆదేశించింది.
బ్యానర్ల ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు స్థానిక అధికారుల అనుమతి తీసుకోలేదని ఈసీ దర్యాప్తులో తేలింది. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు భారీ బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతి పత్రాలు చూపాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరింది. అయితే వారు పర్మిషన్ తీసుకోకపోవడంతో అధికారులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ విషయాన్ని నోటీసులో పేర్కొన్న ఎన్నికల సంఘం కాంగ్రెస్ ప్రెసిడెంట్ వివరణ కోరింది. ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
సమరానికి సిద్ధమైన తలైవా!.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని రజనీ ప్రకటన!