కర్ణాటక పైనా రాహుల్ దృష్టి!.. సీఎం సిద్ధరామయ్య టీమ్ సమావేశం?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మరో పర్యాయం కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంపై కూడా దృష్టి సారించారు.
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మరో పర్యాయం కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంపై కూడా దృష్టి సారించారు.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా కర్ణాటక పార్టీ నేతలతో రాహుల్ గురువారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.

కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో నలుగురు కార్యదర్శులు, సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర, వర్కింగ్ ప్రెసిడెంట్స్ దినేష్ గుండూరురావు, ఎస్.ఆర్.పాటిల్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డీకే శివకుమార్ తదితరులు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకానున్నారు.
ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా రాహుల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ ఎప్పుడు శ్రీకారం చుట్టాలనేది కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అక్టోబర్ చివర్లో రాహుల్ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications