కర్ణాటక పైనా రాహుల్ దృష్టి!.. సీఎం సిద్ధరామయ్య టీమ్ సమావేశం?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మరో పర్యాయం కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంపై కూడా దృష్టి సారించారు.
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మరో పర్యాయం కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంపై కూడా దృష్టి సారించారు.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా కర్ణాటక పార్టీ నేతలతో రాహుల్ గురువారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.

కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో నలుగురు కార్యదర్శులు, సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర, వర్కింగ్ ప్రెసిడెంట్స్ దినేష్ గుండూరురావు, ఎస్.ఆర్.పాటిల్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డీకే శివకుమార్ తదితరులు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకానున్నారు.
ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా రాహుల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ ఎప్పుడు శ్రీకారం చుట్టాలనేది కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అక్టోబర్ చివర్లో రాహుల్ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications