‘మోడీ ఆహ్వానం అందలేదు’: ఒత్తిడేనని రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తనను టీ పార్టీకి పిలవలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మధ్యాహ్నం స్పష్టం చేశారు. అందుకే ‘చాయ్ పే చర్చ'కు తాను వెళ్లడం లేదని ఆయన అన్నారు.
జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్రంపై ఎంతో ఒత్తిడి ఉన్నందువల్లే మోడీ చర్చా మార్గానికి వచ్చారని, ఎన్డీయే ప్రవేశపెట్టిన బిల్లులో తమకు మూడు అభ్యంతరాలున్నాయని రాహుల్ చెప్పారు. వాటిని తొలగిస్తే, మద్దతిచ్చేందుకు తాము సుముఖంగానే ఉన్నామని, అవి తొలగించకుంటే మాత్రం బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యక్రమాలను తాము అడ్డుకోబోమని రాహుల్ గాంధీ చెప్పారు. కాగా, శుక్రవారం సాయంత్రం 7గంటలకు రేస్ కోర్సులోని తన నివాసానికి రావాలని మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా జిఎస్టి బిల్లుకు మద్దతివ్వాలని ఈ భేటీలో కోరే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, పార్లమెంటును సజావుగా సాగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చాయ్ భేటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications