గుజరాత్ మాంగే జవాబ్: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ నాలుగో ప్రశ్న..
న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాలుగో ప్రశ్నను సంధించారు. విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని పరిశీలించినపుడు గుజరాత్ 26వ స్థానంలో ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ రోజుకొక ప్రశ్న చొప్పున అడుగుతున్నారు. 'గుజరాత్ మాంగే జవాబ్' అనే హ్యాష్ట్యాగ్తో ఆయన ట్విట్టర్లో ఇలా ట్వీట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను పణంగా పెట్టి, విద్యను వ్యాపారాత్మకం చేసిందని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

యువత చేసిన తప్పు ఏమిటని నిలదీశారు. గుజరాత్లో విద్య కోసం ఖర్చు పెరుగుతుండటంతో విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. నవ భారతం కల ఎలా వాస్తవమవుతుందని ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నించారు.
గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఈ నెల 9, 14 తేదీల్లో జరుగుతాయి. . నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాలుగు ప్రైవేటు కంపెనీల నుంచి అత్యధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేశారని ఆరోపించిన రాహుల్ గాంధీ ప్రభుత్వ ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications