మోడీ కళ్లల్లో భయం చూశా- అదానీపై ప్రశ్నించగానే.. రాహుల్ కామెంట్స్..
ఢిల్లీ : ప్రధాని మోడీపై (pm modi) ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తీవ్ర విమర్శలకు దిగారు. తన అనర్హత వేటుపై స్పందించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రాహుల్.. ప్రధాని, అదానీపై (adani) సూటి విమర్శలు చేశారు. అదానీకే అన్నికాంట్రాక్టులు ఎలా కట్టబెడుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో తనకు ఎదురైన పరిస్ధితుల్ని రాహుల్ వివరించారు.
అదానీ షెల్ కంపెనీల్లో ఎవరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని, అవి అదానీ పెట్టుబడులు కావని రాహుల్ తెలిపారు. అదానీ, మోడీ బంధంపై తాను ప్రశ్నించానని రాహుల్ వెల్లడించారు. దీనిపై పార్లమెంటులో తన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారని రాహుల్ ఆరోపించారు. తమపై వచ్చే ఆరోపణలకు జవాబు ఇచ్చే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. కానీ స్పీకర్ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.

అదానీపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పుడు ప్రధాని మోడీ కళ్లలో భయం చూశానని రాహుల్ గాంధీ వెల్లడించారు. పార్లమెంటులో అదానీపై తాను వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, కానీ తన వ్యాఖ్యల్ని మాత్రం రికార్డుల నుంచి తొలగించారన్నారు. ప్రధాని మోడీ-అదానీ బంధానికి ఇదే నిదర్శనం అన్నారు. అదానీ గురించి అడిగితే దేశంపై దాడి అంటున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ మాజీ ఎంపీ తెలిపారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications