మోడీ కళ్లల్లో భయం చూశా- అదానీపై ప్రశ్నించగానే.. రాహుల్ కామెంట్స్..
ఢిల్లీ : ప్రధాని మోడీపై (pm modi) ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తీవ్ర విమర్శలకు దిగారు. తన అనర్హత వేటుపై స్పందించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రాహుల్.. ప్రధాని, అదానీపై (adani) సూటి విమర్శలు చేశారు. అదానీకే అన్నికాంట్రాక్టులు ఎలా కట్టబెడుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో తనకు ఎదురైన పరిస్ధితుల్ని రాహుల్ వివరించారు.
అదానీ షెల్ కంపెనీల్లో ఎవరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని, అవి అదానీ పెట్టుబడులు కావని రాహుల్ తెలిపారు. అదానీ, మోడీ బంధంపై తాను ప్రశ్నించానని రాహుల్ వెల్లడించారు. దీనిపై పార్లమెంటులో తన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారని రాహుల్ ఆరోపించారు. తమపై వచ్చే ఆరోపణలకు జవాబు ఇచ్చే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. కానీ స్పీకర్ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.

అదానీపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పుడు ప్రధాని మోడీ కళ్లలో భయం చూశానని రాహుల్ గాంధీ వెల్లడించారు. పార్లమెంటులో అదానీపై తాను వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, కానీ తన వ్యాఖ్యల్ని మాత్రం రికార్డుల నుంచి తొలగించారన్నారు. ప్రధాని మోడీ-అదానీ బంధానికి ఇదే నిదర్శనం అన్నారు. అదానీ గురించి అడిగితే దేశంపై దాడి అంటున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ మాజీ ఎంపీ తెలిపారు.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications