Adani US bribe case: అదానీని రక్షించేది మోదీనే!
ప్రస్తుతం దేశంలో భారతీయ బిలియనీర్ అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానిపైన లంచం ఇవ్వజూపారని, మోసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలతో న్యూయార్క్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో భారతదేశంలో దీనిపైన తీవ్రంగా కలకలం రేగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ వ్యవహారం పైన స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ గౌతమ్ అదానీ వ్యవహారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.
అదానీని ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారు
దేశంలో అవినీతి అక్రమాలు జరిగాయి అంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, కానీ అదానీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అదానీని ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారని, లేకుంటే ఇప్పటికే ఆయన అరెస్టు కావలసి ఉందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. భారత చట్టాలను, అమెరికా చట్టాలను అదానీ ఉల్లంఘించారని నిరూపించబడిందని ఆయన పేర్కొన్నారు .

అదానీ అరెస్ట్ కు రాహుల్ గాంధీ డిమాండ్
సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణల వ్యవహారంలో గౌతమ్ అదాని మరో ఏడుగురు తో కలిసి భారత్లోని భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్.బి.ఐ చెబుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక నిధులను సమీకరించడం కోసం బ్యాంకులకు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా సంచలన ఆరోపణలు వెలువెత్తుతున్న వేళ ఆయనను అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు
అమెరికాలో అదాని లంచం, మోసం ఆరోపణలు స్పష్టంగా నిరూపించబడినప్పటికీ, అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. గతంలో కూడా అనేక సందర్భాలలో అదాని కుంభకోణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు సాక్షిగా చెప్పామని, అయినప్పటికీ అదానిపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం ముందుకు రాలేదన్నారు.
అదానీ విషయంలో మా డిమాండ్ ఇదే
ఎందుకంటే 100% ప్రధాని మోదీనే ఆయనను కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీ అక్రమాలపై విచారణ జరపడం కోసం జె పి సి ని ఏర్పాటు చేయాలని కూడా తమ ముందు నుంచి డిమాండ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా అదే కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో కచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని, ఎక్కడ అదానీ అవినీతికి పాల్పడిన కచ్చితంగా విచారణ జరపాల్సిందేనన్నారు.
అదానీని అరెస్టు చేస్తే చాలా విషయాలు బయటకు
అంతేకాదు అదానికి తోడుగా ఉన్న వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అదానీ ని అరెస్టు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అందుకే ఆయనపై విచారణ జరపరని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications