రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తాం: మోడీ, బీజేపీపై రాహుల్ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీతోపాటు మహారాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడంతోపాటు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్లో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటను ఉద్దేశించి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజలను భయపెడుతూ.. రాజ్యాంగాన్ని, ఆయా సంస్థలను నాశనం చేస్తూ.. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఎదుట తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాహుల్ మండిపడ్డారు. శివాజీ అందించిన సందేశం దేశమంతటికీ వర్తిస్తుందన్నారు.

ఛత్రపతి, సాహూ మహరాజ్ లాంటి యోధులు లేకపోయి ఉంటే.. నేడు మనకు రాజ్యాంగం ఉండేది కాదన్నారు రాహుల్ గాంధీ. దళితులు, వెనుకబడిన వర్గాల చరిత్రను పాఠశాలల్లో బోధించడం లేదని, ఆ చరిత్రను చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు.
మరోవైపు, సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో కూడా రాహుల్ పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు పార్లమెంటులో చట్టాలను సవరించేలా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కృషిచేస్తాయని రాహుల్ తెలిపారు. లోక్సభ, రాజ్యసభల్లో కుల గణనపై చట్టం ఆమోదం పొందేలా చూస్తామని, దానిని ఏ శక్తి అడ్డుకోలేదని రాహుల్ స్పష్టం చేశారు.
VIDEO | Congress MP and Leader of Opposition in Lok Sabha Rahul Gandhi (@RahulGandhi) unveils a statue of Chhatrapati Shivaji Maharaj in #Kolhapur, Maharashtra.
— Press Trust of India (@PTI_News) October 5, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/bTOmGbXMMk
రాజ్యాంగాన్ని కాపాడేందుకు మొట్టమొదటగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే రిజ్వర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని రాహుల్ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికే పలు మార్లు ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించానని తెలిపారు. అది ఆరంభం మాత్రమేనని, 50 శాతం పరిమితి ఇప్పుడు మన ముందున్న అవరోధమని చెప్పారు. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి లోక్సభ, రాజ్యసభలో మారుస్తాయని రాహుల్ హామీ ఇచ్చారు.
కాగా, భారీ వర్షాల కారణంగా ఈ ఏడాది ఆగస్టులో రాజ్కోట్ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయగా తీవ్ర దుమారం రేపింది. నాణ్యతా లోపం కారణంగా విగ్రహం కూలిపోయిందంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే, మహారాష్ట్రలో పర్యటించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. శివాజీకి తలవంచి క్షమాపణలు తెలియజేశారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదన్నారు.ఈ నేపథ్యంలోనే రాహుల్ తాజాగా విమర్శలు చేయడం గమనార్హం.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications