వందేళ్ల క్రితం పంబన్ బ్రిడ్జి వద్ద మేజర్ క్రాక్స్ (పిక్చర్స్)
చెన్నై: లైన్మెన్ల అప్రమత్తత వల్ల తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. పంబన్ బ్రిడ్జి వద్ద మేజర్ క్రాక్ వచ్చింది. దీనిని లైన్మెన్లు గుర్తించారు. దీంతో ప్రమాదం తప్పింది. దీనిని గుర్తించిన అధికారులు మూడు రైళ్లను నిలిపివేశారు. అందులో చెన్నై - రామేశ్వరం ఎక్స్ప్రెస్ కూడా ఉంది.
పంబన్ బ్రిడ్జి వద్ద వంద మీటర్ల దూరంలో క్రాక్ వచ్చింది. దీనిని లైన్మెన్లు గురువారం ఉదయం పదకొండు గంటలకు గుర్తించారు. ఓ పాసింజర్ రైలు అప్పటికే ఈ బ్రిడ్జిని దాటింది. అది మండపం నుండి పంబన్ వెళ్తోంది. అనంతరం దీనిని గుర్తించారు. దీంతో మిగిలిన రైళ్లను నిలిపారు.
ఈ కారణంగా మూడు రైళ్లు 55 నిమిషాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని రైళ్లు గంటలకొద్ది ఆలస్యమయ్యాయి. వాటిని ఆయా స్టేషన్లలలో నిలిపివేశారు. ట్రాక్ను సరిదిద్దిన తర్వాత ట్రయల్ రన్ వేసిన, తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. కాగా, అప్రమత్తమై వెంటనే సమాచారం అందించిన వారిని రైల్వే అధికారులు అభినందించారు. రామేశ్వరం వద్ద ఉన్న ఈ బ్రిడ్జి వందేళ్ల క్రితంది.
పంబన్ రైల్వే బ్రిడ్జి
లైన్మెన్ల అప్రమత్తత వల్ల తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. పంబన్ బ్రిడ్జి వద్ద మేజర్ క్రాక్ వచ్చింది. దీనిని లైన్మెన్లు గుర్తించారు. దీంతో ప్రమాదం తప్పింది. దీనిని గుర్తించిన అధికారులు మూడు రైళ్లను నిలిపివేశారు.
పంబన్ రైల్వే బ్రిడ్జి
పంబన్ బ్రిడ్జి వద్ద వంద మీటర్ల దూరంలో క్రాక్ వచ్చింది. దీనిని లైన్మెన్లు గురువారం ఉదయం పదకొండు గంటలకు గుర్తించారు.
పంబన్ రైల్వే బ్రిడ్జి
ఓ పాసింజర్ రైలు అప్పటికే ఈ బ్రిడ్జిని దాటింది. అది మండపం నుండి పంబన్ వెళ్తోంది. అనంతరం దీనిని గుర్తించారు. దీంతో మిగిలిన రైళ్లను నిలిపారు.
పంబన్ రైల్వే బ్రిడ్జి
ఈ కారణంగా మూడు రైళ్లు 55 నిమిషాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని రైళ్లు గంటలకొద్ది ఆలస్యమయ్యాయి. వాటిని ఆయా స్టేషన్లలలో నిలిపివేశారు. ట్రాక్ను సరిదిద్దిన తర్వాత ట్రయల్ రన్ వేసిన, తర్వాత రైళ్లను పునరుద్ధరించారు.