నెట్లో కేంద్రమంత్రి కునుకు!, గడ్కరీకి తప్పిన ప్రమాదం
తిరువనంతపురం: జూన్ 21వ తేదీన యోగా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యోగా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు అందరు పాల్గొన్నారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు కేరళలో యోగా డేలో పాల్గొన్నారు.
సురేష్ ప్రభు శవాసనం వేసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆయన శవాసనం వేసిన సమయంలో కాస్త కునుకు తీసినట్లుగా ఉంది. ఓ వాలంటీర్ వచ్చి లేపాక సురేష్ ప్రభువు శవాసనం నుండి లేచారు. దీనిని ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు.

డీఎండీకే నేత, నటుడు విజయకాంత్కు చెందిన యోగా వీడియో కూడా ఇంటర్నెట్లో కనువిందు చేస్తోంది. కాగా, యోగా డే అనంతరం తర్వాత రోజు సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత శశిథరూర్.. సురేష్ ప్రభు యోగా పైన ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
#InternationalDayofYoga inaugurator in Kerala, Railway Minister Mr. Suresh Prabhu slept while doing Yoga :D :D pic.twitter.com/M543mndLmT
— Leons Peter (@leonspeter) June 22, 2015 నితిన్ గడ్కరీకి తప్పిన ముప్పు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కార్పెట్లు తగిలాయి. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications