అన్ని రాజ్ భవన్ల పేర్ల మార్పు: రాజధాని ఎక్స్ప్రెస్ ఇక..: కేంద్రానికి కీలక సూచనలు
న్యూఢిల్లీ: ఇదివరకు ఉత్తర ప్రదేశ్లో పలు నగరాల పేర్లు పూర్తిగా మారిపోయాయి. మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరును పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయగా మార్చిందక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అలహాబాద్కు ప్రయాగ్రాజ్గా నామకరణం చేసింది. రాజధాని లక్నో పేరును లక్షణపురిగా మార్చడానికి యోగి సర్కార్ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం విస్తృతంగా సాగింది. అదే ఆనవాయితీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగిస్తోన్నారు. దేశ రాజధానిలో కొన్ని ప్రాంతాల పేర్లల్లో మార్పులు చేశారు.
కింగ్స్వే, రాజ్పథ్ పేరును తొలగించి- కొత్తగా కర్తవ్యపథ్గా పేరు పెట్టారాయన. బ్రిటీష్ హయాంలో కింగ్స్వేగా ఉన్న పేరు ఆ తరువాత రాజ్పథ్గా మారింది. ఇప్పుడు మోదీ దాన్ని తొలగించారు. కర్తవ్యపథ్గా కొత్త పేరు పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని- వలసవాద పాలనలో ఏర్పాటైన పేర్లు, చిహ్నాలను తొలగిస్తామంటూ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తోన్నారు.

రాజ్పథ్ పేరు తొలగించి కర్తవ్యపథ్గా మార్చడాన్ని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు శశి థరూర్ తప్పుపట్టారు. రాజ్ అనే పేరులో ఎలాంటి తప్పు ఉందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలపై ఉన్న అక్కసుతోనే దీన్ని తొలగించినట్లు కనిపిస్తోందని అన్నారు. రాజ్ అనే పేరును తొలగించాల్సి వస్తే- దేశంలోని అన్ని రాజ్ భవన్ల పేర్లను కూడా మార్చాల్సి ఉంటుందని చెప్పారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ పేరును కర్తవ్య భవన్గా మార్చుతారా? అని ప్రశ్నించారు.

రాజస్థాన్ పేరును కూడా తొలగించి దాన్ని కర్తవ్యస్థాన్గా మార్చాలని శశి థరూర్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ను పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా లేవనెత్తారు. రాజధాని ఎక్స్ప్రెస్ను కర్తవ్యధాని ఎక్స్ప్రెస్గా మార్చక తప్పదంటూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు సంధించారు. అలాగే- రాజ్ భోగ్ స్వీట్ పేరును కర్తవ్య భోగ్గా మార్చే ఆలోచన ఉందా? అని మహువా మొయిత్రా కేంద్రాన్ని ప్రశ్నించారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications