Rajasthan Polls: రాజస్తాన్ లో ప్రచారానికి కాసేపట్లో ముగింపు-మోడీ-గెహ్లాట్ పోరులో గెలిచేదెవరు ?
ఉత్తరాది రాష్ట్రం రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. రాజస్తాన్ లోని 200 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 25న పోలింగ్ జరగబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ ఆశలు పెట్టుకున్న ఏకైక రాష్ట్రం కూడా ఇదే. దీంతో ప్రధాని మోడీ ఇక్కడ తీవ్రంగా ప్రచారం చేశారు.
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఇచ్చింది. ఇందులో కులగణనతో పాటు పలు హామీలిచ్చింది. తద్వారా రాష్ట్రంలో అత్యధిక బీసీల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ దీన్ని కౌంటర్ చేసేందుకు గెహ్లాట్ సర్కార్ లో మహిళలపై దాడులు, అవినీతి వంటి అంశాల్ని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రసంగాల్లో గెహ్లాట్ ను పదే పదే టార్గెట్ చేయడంతో మిగతా అంశాలన్నీ పక్కకు వెళ్లిపోతున్నాయి.

రాజస్తాన్ లో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించిన అశోక్ గెహ్లాట్ కూ, సీఎం పదవిపై ఆశ పెట్టుకుని విఫలమైన సచిన్ పైలట్ కూ మధ్య పోరు నడిచింది. అయితే ఎన్నికల వేళ ఆ ప్రభావం పార్టీ అవకాశాలపై పడకుండా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. అయినా పైలట్ సామాజికవర్గమైన గుజ్జర్లతో పాటు ఎస్టీలు, ముస్లింలు కూడా ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. అయితే వీరంతా బీజేపీకి ఓటు వేయకపోయినా కాంగ్రెస్ కు దూరంగా ఉంటే చాలు ఆ పార్టీకి కష్టాలు తప్పవు. ఇందులో గుజ్జర్లు మాత్రం కాంగ్రెస్ పై కోపంతో బీజేపీవైపు మొగ్గే అవకాశముంది.
అందుకే ప్రధాని మోడీ.. గెహ్లాట్, పైలట్ పోరును పదే పదే జనాల్లోకి పంపేందుకు ప్రయత్నించారు. అలాగే మహిళలపై పెరిగిన దాడులు, ఇతర వర్గాల పరిస్ధితులు, కులం వంటి అంశాలను ప్రస్తావించారు. దీంతో మోడీ వర్సెస్ గెహ్లాట్ గా మారిపోయిన ఈ పోరు స్ధానిక బీజేపీ నేతల్ని డమ్మీలుగా మార్చేసింది. ఇప్పుడు గెహ్లాట్ కావాలా మోడీ సర్కార్ కావాలా అన్నట్లు పరిస్ధితి మారింది. తాజా పరిమాణాలపై చికాకుగా ఉన్న గెహ్లాట్.. మోడీ రాజస్తాన్ ఎన్నికల్ని లోక్ సభ ఎన్నికల్లా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలా గెహ్లాట్ వర్సెస్ మోడీగా మారిన పోరులో ఓటర్లు ఎవరిని ఆదరించబోతున్నారో ఎల్లుండి తేలిపోనుంది.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications