ఇజ్రాయెలో చిక్కుకున్న భారత ఎంపీ కుటుంబం, మరికొందరు భారతీయులు
జెరూసలెం: హమాస్ ఉగ్రవాదుల భీకరదాడులతో మొదలైన యుద్దం కొనసాగుతోంది. ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడులకు దిగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్లో ప్రవేశించిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరుతోపాటు విదేశీయులను కూడా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
అంతేగాక, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. బందీలుగా పట్టబుడిన వారిలో థాయ్లాండ్ , నేపాల్కు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతేగాక, భారతదేశానికి చెందిన పౌరులు కూడా హమాస్ ఉగ్రవాదులకు చిక్కినట్లు సమాచారం.

మరోవైపు, భారత్ నుంచి జెరూసలెం పర్యటనకు వెళ్లిన రాజ్యసభ ఎంపీ వాన్వేయ్ రాయ్ ఖార్లుఖీ సహా 24 మంది బెత్లహాంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేఘాలయ నుంచి నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖార్లుఖీ.. కుటుంబసభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లారు.
ఊహించని విధంగా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడులు చేయడంతో అక్కడే చిక్కుకున్నారు. వీరితోపాటు మరో 24 మంది భారతీయులు అక్కడే క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. వీళ్ల పరిస్థితి గురించి మేఘాలయ సీఎం, ఎన్పీపీ అధ్యక్షుడు కార్నాడ్ సంగ్మా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. విదేశాంగ శాఖ, ఇజ్రాయెల్లోని భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్లందర్నీ క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

కాగా, థాయ్లాండ్కు చెందిన 11 మందిని హమాస్ బంధించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. వారిని గాజాకు తరలించినట్లు పేర్కొంది. వాళ్లంతా అమాయక ప్రజలని, అక్కడి పరిణామాలతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని థాయ్ ప్రధాని శ్రత్థా థవిసిన్ పేర్కొన్నారు. వారందరినీ క్షేమంగా విడిచిపెట్టాలని కోరారు. కాగా, శనివారం హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు థాయ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఇజ్రాయెల్లో పలువురు తమ పౌరులు కూడా మిస్సయ్యారని బ్రిటన్ పేర్కొంది. ఇది ఇలావుండగా, 17 మంది నేపాల్ విద్యార్థులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్లో నేపాల్ రాయబారి కాంతా రిజల్ తెలిపారు. వీరిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications